కరీమాబాద్, డిసెంబర్ 3: నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందని, ఈ నేపధ్యంలో జాబ్మేళా ఏర్పాటు చేశామని వర్ధన్నపేట ఎమ్మెల్యే, టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ అన్నారు. అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం మామునూరులో ఏర్పాటు చేసిన మెగా జాబ్మేళాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అరూరి మాట్లాడుతూ ఉద్యో గం సాధించాలనే యువతకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ శిక్షణ అందించడంతోపాటు మెగా జాబ్మేళాను ఏర్పాటు చేశామన్నారు. దీంతో పలు కంపెనీలు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాయన్నారు.
అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ అందించిన శిక్షణతో వందలాది మంది ఉద్యోగులు సాధించారని రమేశ్ వివరించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారని తెలిపారు. ఫౌండేషన్ సెక్రెటరీ అరూరి విశాల్ మాట్లాడుతూ వర్ధన్నపేట నియోజకవర్గంలోని యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతో గతంలో శిక్షణ ఇవ్వగా, నేడు జాబ్మేళా నిర్వహించామన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.