జయశంకర్ భూపాలపల్లి : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాశింపల్లికి చెందిన ఎడ్ల కుమార్(36) అనే యువ రైతు అడవి జంతువుల కోసం అమర్చిన కరెంటు తీగకు తగిలి మృతి చెందాడు. కుమార్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. అడవి జంతువుల కోసం ఉచులు అమర్చిన వారిని కఠినంగా శిక్షించి, మృతుని కుటుంబానికి సరైన న్యాయం చేస్తామన్నారు.