జయశంకర్ భూపాలపల్లి : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అములు చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గణపురం మండలానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి,ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతుబంధు, రైతు బీమా, మహిళలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కేసీఆర్ కిట్టు సంక్షేమ పథకాలను అందిస్తుందని తెలిపారు. అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.