జయశంకర్ భూపాలపల్లి : సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలోని పల్లెల రూపురేఖలు మారిపోయాయని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ అన్నారు. శుక్రవారం భూపాలపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించి మాట్లాడారు.
భూపాలపల్లి మండలంలోని నాగారం, కమలాపూర్ గ్రామాల్లో రూ. 5 కోట్లతో రెండు చెక్ డ్యామ్ ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు. సాగునీటి రంగానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.