జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని మహాదేవపూర్ మండలం అంబటిపల్లి పరిధిలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లక్ష్మీ బరాజ్ ని పారిశ్రామిక వేత్తలతో కలిసి చేవెళ్ల, పెద్దపల్లి ఎంపీలు రంజిత్ రెడ్ది, వెంకటేష్ నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కీర్తి గడించిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి విన్నామే కానీ చూడలేదు. ఇప్పుడు ఎంపీ వెంకటేష్ నేత సారథ్యంలో కలిసి కాలేశ్వరం ప్రాజెక్టు ను సందర్శించడం చాలా ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అనంతరం సరస్వతి బరాజ్, లక్ష్మీ పంపు హౌస్ను సందర్శించారు.