ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ మానుకోవాలి
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలి
‘భారత్ బంద్’ సందర్భంగా నాయకుల డిమాండ్
కేంద్ర సర్కారు తీరును ఎండగడుతూ నిరసనలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు
నమస్తే నెట్వర్క్:శుక్రవారం తలపెట్టిన ‘భారత్ బంద్’ ఉమ్మడిజిల్లాలో విజయవంతమైంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయడంతోపాటు ప్రభుత్వరంగ సంస్థ ప్రైవేటీకరణ మానుకోవాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ధరలను తగ్గించాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల్లో రాస్తారోకోలు, ర్యాలీలతో హోరెత్తించారు. ఇందులో సీపీఐ(ఎంఎల్), సీపీఎం, ఎంసీపీఐ, రైతు, కార్మిక సంఘాలు, పలుచోట్ల కాంగ్రెస్ నాయకులు పాల్గొని నిరసన తెలిపారు.