జయశంకర్ భూపాలపల్ల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల కోసం ప్రభుత్వం ఖర్చు
గన్నీ సంచుల కోసం రూ. 13.18 కోట్లు
టార్పాలిన్లు, తేమ పరికరాలకు రూ. 14.39 లక్షలు
ఎలక్ట్రానిక్ కాంటాలతోపాటు ప్యాడీ క్లీనర్లకు రూ. 1.27 కోట్లు
జయశంకర్ భూపాలపల్లి, మే19(నమస్తేతెలంగాణ): జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పా టు చేసిన 206 కేంద్రాల్లో ప్రభుత్వం రూ. 20,01,80,000తో వసతులు కల్పించింది. వడ్లను సంచుల్లో నింపడానికి గన్నీ సంచులు, తూకం వేయడానికి ఎలక్ట్రానిక్ మిషన్లు, తేమను కొలిచే యంత్రాలు, తాలును తీసేందుకు ప్యాడీ క్లీనర్స్, ధాన్యం తడువకుండా ఉండేం దుకు టార్పాలిన్లతోపాటు కేంద్రాల నుంచి మిల్లులకు తర లించే వాహనాలను సమకూర్చేందుకు ఈ నిధులు కేటా యించింది. వీటిని జిల్లా మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ధాన్యం కొనుగోలు పూర్తయిన తరువాత ఈ పరికరాలను సంబంధిత శాఖకు అప్పగించాల్సి ఉంటుంది. ఇందులో పౌరసరఫరాల శాఖ నుంచి గన్నీ సంచులను సమకూర్చడంతోపాటు రవాణా సౌకర్యాలను టెండర్ల ప్రక్రియ ద్వారా పూర్తి చేస్తారు.
రూ. 20 కోట్లతో సౌకర్యాలు..
15లక్షల పాత గన్నీ సంచులకు రూ. 3.90 కోట్లు, 16 లక్షల కొత్త గన్నీ సంచులను ఒక్కొక్కటి రూ.58 చొప్పున రూ.9.28 కోట్లు ఖర్చు చేసి పౌరసరఫరాల శాఖ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేసింది. 4200 టార్పా లిన్లకు ఒక్కొక్కటి రూ. 8,800 చొప్పున రూ. 3,69,600, 214 తేమను కొలిచే యంత్రాలను ఒక్కొక్కటి 5 వేల చొప్పున రూ. 10 లక్షల 70వేలు, 206 ఎలక్ట్రానిక్ కాంటా లను ఒక్కొక్కటి 9,500 చొప్పున రూ. 19,57,000, 196 ప్యాడీ క్లీనర్స్ను ఒక్కొక్కటి రూ. 55 వేల చొప్పన కోటీ ఏడు లక్షల ఎనభై వేలతో కొనుగోలు చేసి సెంటర్లకు అప్పగించింది. అదేవిధంగా దాన్యం రవాణా కోసం మూడు ట్రాన్స్ పోర్టర్లకు చెందిన వాహనాలను ఉప యోగించనుంది. ధాన్యంను తూకం, లోడ్ చేయడానికి హమాలీలను అందు బాటులో ఉంచింది.