భూపాలపల్లి టౌన్ : జిల్లా ఆసుపత్రిని త్వరలోనే సకల హంగులతో ప్రారంభించుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ఫ్లాంటు (500 ఎల్పీఎం)ను గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం వార్డులలో తిరుగుతూ బాలింతలతో మాట్లాడారు. దవాఖానలో సేవలు ఎలా ఉన్నాయి.. వైద్యులు, సిబ్బంది బాగా చూసుకుంటున్నారా.. ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. దవాఖానలో సేవలు చాలా బాగున్నాయని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాతో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడిందని, దీంతో ప్రభుత్వం అన్ని దవాఖానల్లో ఆక్సిజన్ ఫ్లాంట్లను ఏర్పాటు చేసిందన్నారు.
ఇక ఇప్పుడు ఆక్సిజన్ కొరత అనేదే ఉండదన్నారు. వంద పడకల హస్పిటల్ (జిల్లా ఆసుపత్రి)లో తాత్కాళిక సేవలు కొనసాగుతున్నాయని త్వరలోనే వైద్యుల నియామకం జరిపి హాస్పిటల్ను ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్ధు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, జడ్పీ వైస్ చైర్పర్సన్ కళ్లెపు శోభ రఘుపతిరావు, ఎంపీపీ మందల లావణ్యసాగర్రెడ్డి, టీఆర్ఎస్ అర్భన్ అధ్యక్షులు కటకం జనార్ధన్, నాయకులు బండారి రవి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.