జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణ ప్రాణహితగా విలసిల్లుతున్న కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడోసంవత్సరంలోకి అడుగుపెడుతున్నది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కాళేశ్వరంతో ప్రాజెక్ట్తో తెలంగాణ బీడు భూములు సస్యశ్యామలం అవుతున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ చరిత్రలో అద్భుత కట్టడంగా నిలిచిపోతుందన్నారు. ఇదంతా కేవలం సీఎం కేసీఆర్ దార్శనికత వల్ల సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.