సీఎం కేసీఆర్ ఆలోచనలను పకడ్బందీగా అమలుచేస్తాం
దళిత సాధికారతను సాధించి చూపిస్తాం
ప్రభుత్వ ప్రణాళికలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్
కేయూ బోధన, బోధనేతర, విద్యార్థి సంఘాలతో సమావేశం
హన్మకొండ, జూన్ 28: దళితుల పురోభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సీఎం ఆలోచనలు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేస్తామని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ పేర్కొన్నారు. సోమవారం హన్మకొండ బాలసముంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దళిత సాధికారతపై కాకతీయ యూనివర్సిటీ బోధన, బోధనేతర, విద్యార్థి సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో అత్యంత పేద దళితులకు త్వరలో రూ.10 లక్షల ఆర్థిక సహాయం నేరుగా అందనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ దళితుల కోసం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం డాక్టర్ పుల్లా శ్రీనివాస్కు మొక్క అందించి శాలువాతో సన్మానించారు. దళితుల కోసం అమలు చేస్తున్న పథకాలు, ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. దళిత, ఉద్యోగ, కార్మిక, విద్యార్థి సంఘాలు ప్రభుత్వంతో కలిసి నడువాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కేయూ టీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులు బొల్లికొండ వీరేందర్, బైరపాక ప్రశాంత్, రాజేందర్, రంజిత్, సుమన్, వీరస్వామి, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.