ఆకర్షితులవుతున్న ఇతర పార్టీల నేతలు
టీఆర్ఎస్లోకి వచ్చే వారిని స్వాగతిస్తున్నాం
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి
పార్టీలో కాంగ్రెస్ నాయకుల చేరిక
నర్సంపేట రూరల్, జనవరి 23: రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పాలన అందిస్తున్నదని, టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఇతర పార్టీల నేతలు ఆకర్షితులవున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని ఇటుకాలపల్లికి చెందిన మాజీ సర్పంచ్ బొడిగె శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బశిక రవి, కందికొండ స్వామితోపాటు మరో ఏడుగురు ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి పెద్ది గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్లో చేరే వారికి స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి చాలామంది పార్టీలో చేరుతున్నారని పెద్ది అన్నారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, నర్సంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్రెడ్డి, ఇటుకాలపల్లి సర్పంచ్ మండల రవీందర్, ఎంపీటీసీ వీరన్న, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పిట్టల శ్రీను, నాయకులు తాళ్లపల్లి రాముగౌడ్, బొడిగె వినయ్గౌడ్, మండల రాజమౌళి పాల్గొన్నారు.
జాగృతం చేసిన టీజేఎస్ఎఫ్
నర్సంపేట: తెలంగాణ ఉద్యమ సమయంలో టీజేఎస్ఎఫ్ ముందుండి ప్రజలను జాగృతం చేసిందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. క్యాంపు కార్యాలయంలో టీజేఎస్ఎఫ్ క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో తెలంగాణ జాగృతి సంస్థ ప్రజలను ఎంతో చైతన్యవంతులను చేసిందని కొనియాడారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను దేశవిదేశాలకు చాటిచెప్పిందన్నారు. ముఖ్యంగా బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేయడంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కృషి ఎనలేనిదన్నారు. భవిష్యత్ కార్యాచరణ కూడా ముందు తరాలకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎన్నారై సెల్ అధికార ప్రతినిధి శానబోయిన రాజ్కుమార్, జాగృతి నియోజకవర్గ అధ్యక్షుడు జెట్టబోయిన సాంబమూర్తి, నాయకులు బొంతల సాయికుమార్, కుమార్, రాజు, రవితేజ, టీఆర్ఎస్ నాయకులు గుంటి కిషన్, మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్రెడ్డి, రాయిడి రవీందర్రెడ్డి, నల్ల మనోహర్రెడ్డి, నాగెల్లి వెంకటనారాయణగౌడ్, పుట్టపాక కుమారస్వామి, సత్యనారాయణ, శ్రీను, తిరుపతి, సోమయ్య పాల్గొన్నారు.
బీసీసెల్ నూతన కార్యవర్గం..
నర్సంపేట రూరల్: టీఆర్ఎస్ బీసీసెల్ మండల అధ్యక్షుడిగా ముగ్ధుంపురం గ్రామానికి చెందిన పెండ్యాల సదానందం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభ్యులుగా మహేందర్, సదానందం, రఘునాథ్, రంజిత్, రామకృష్ణ, రాజయ్య, శంకర్లింగం, రాజు, సతీశ్, చెన్నయ్య, కొమురయ్యను ఎన్నుకున్నారు. అధ్యక్షుడు సదానందానికి ఎమ్మెల్యే పెద్ది నియామక పత్రం అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, నాయకులు మోతె పద్మనాభరెడ్డి, కోమాండ్ల గోపాల్రెడ్డి, మోతె జైపాల్రెడ్డి, మచ్చిక నర్సయ్యగౌడ్, కట్ల సుదర్శన్రెడ్డి, బానోత్ కిషన్ పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
పట్టణంలోని ద్వారకపేట 6వ వార్డుకు చెందిన డ్యాగల నర్సయ్య(81) ఆదివారం మృతి చెందాడు. అతడికి భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ద్వారకపేటకు వెళ్లి నర్సయ్య మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే వెంట 6వ వార్డు కౌన్సిలర్ రామసహాయం శ్రీదేవి, టీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు దుగ్గి రాజు, నాయకులు మునిగాల సాయికృష్ణారెడ్డి, రాయరాకుల వీరన్న, విశ్వేశ్వరాచారి, పెండ్యాల రాజు ఉన్నారు.