గోవిందరావుపేట, జనవరి 23 : మండలంలోని లక్నవరం లో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా తరలి రాగా వేలాడే వంతెనలపై నడుస్తూ బోటింగ్ పాయింట్ వద్దకు చేరుకున్నారు. స్పీడ్, పెద్ద బోటులలో సరస్సులో ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను తిలకించారు. అనంతరం సెల్ఫోన్లలో, కెమెరాల్లో లక్నవరం అందాలను బంధించుకున్నారు. కాగా, టూరిజం కార్పొరేషన్ ఎండీ బోయినపల్లి మనోహర్రావు టూరిజం శాఖ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి సందర్శించారు. మొదటి, రెండో ఐలాండ్లోని కాటేజీలను పరిశీ లించారు. పర్యాట కులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని స్థానిక మేనేజర్కు సూచించారు. మూడో ఐలాండ్లో కాటేజీ నిర్మాణ పనులను పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూడాలన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున పర్యాటకులు తప్పనిసరిగా నిబంధనలు పాటిస్తూ సిబ్బందికి సహకరించాలని కోరారు. టూరిజం శాఖ ఈఈ కాంతారావు, డీఈ ఏకాంబ్రం, ఏఈ ఇమ్మాయిత్, వరంగల్ ఉమ్మడి జిల్లాల మేనేజర్ అశోక్రెడ్డి, స్థానిక మేనేజర్ కిరణ్ ఉన్నారు.