గొర్రెల యూనిట్ వ్యయం పెంపుపై
గొల్ల, కురుమల హర్షం
మంగపేట/ తాడ్వాయి/ మల్హర్/ గణపురం/ గోవిందరావుపేట/ పలిమెల, జూలై 22 : గొల్ల, కురుమలకు రెండో విడుత గొర్రెల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తంచేస్తూ పలు చోట్ల టీఆర్ఎస్, యాదవ సంఘం నాయకులు గురువారం సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. మంగపేట మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద యాదవ సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, జడ్పీ చైర్మన్ జగదీశ్వర్ చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కుడుముల లక్ష్మీనారాయణ, గుండేటి రాజుయాదవ్, సహకార సంఘ వైస్ చైర్మన్ కాడబోయిన నరేందర్, డైరెక్టర్ సింగరబోయిన నర్సయ్యయాదవ్, మంగపేట గ్రామ అధ్యక్షుడు నూనె లింగయ్యయాదవ్, ఊడుగుల శ్రీనివాస్యాదవ్, లొడంగి లింగయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు. తాడ్వాయి మండలకేంద్రంలో యాదవుల సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇంద్రారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బండారి చంద్రయ్య, జైపాల్రెడ్డి, యాదవులు తదితరులు పాల్గొన్నారు. మల్హర్ మండలంలోని కొయ్యూర్లో అఖిల భారత యాదవ సంఘం మండల ఆధ్యక్షుడు బోంతల రాజు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొర్రెల పంపిణీకి రూ.11వేల కోట్లు కేటాయించి, తొలి విడుతగా రూ.600 కోట్లు విడుదల చేయడం, ఒక్కో యూనిట్ ధర రూ.లక్ష 75 వేలకు పెంచడం హర్షనీయమన్నారు. కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు యాదండ్ల రామన్న, మంథని మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోయిని రాజన్న, సంఘం ప్రధాన కార్యదర్శి కొడారి బాపు, సంఘం నాయకులు రాజయ్య, గాదెనవేని బాపు తదితరులు పాల్గొన్నారు. గణపురం మండల కేంద్రంలో అఖిల భారత యాదవ మహాసభ భూపాలపల్లి నియోకవర్గ ప్రధాన కార్యదర్శి మామిండ్ల సాంబయ్య యాదవ్ ఆధ్వర్యంలో గొల్ల, కురుమలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో చెన్నవేని కృష్ణ, పోతర్ల అశోక్ యాదవ్, ఉడుత సాంబయ్య, మంతుర్థి భద్రయ్య, సమ్మయ్య, మల్లేశ్, ఉడుత రవీందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పలిమెల మండలంలోని పంకెన గ్రామంలో యాదవ సంఘం మండలాధ్యక్షుడు మోతె కిష్టయ్య ఆధ్వర్యంలో యాదవులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు బొచ్చు సమ్మయ్య, మోతె ప్రణీత్, మోతె రమేశ్, మోతె ప్రశాంత్, తిరుపతి పాల్గొన్నారు.
యాదవుల సంక్షేమం కోసం గొర్రెల యూనిట్ వ్యయం పెంపుపై యాదవులు హర్షం వ్యక్తం చేస్తున్నారని యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు, టీఆర్ఎస్ పస్రా గ్రామ కమిటీ అధ్యక్షుడు వర్థం చందర్రాజు అన్నారు. గోవిందరావుపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం కృషి చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్కు యాదవ కులస్తులు రుణపడి ఉంటారని అన్నారు.