సీఎం కేసీఆర్ దూర దృష్టితోనే దేశంలోనే అన్ని రంగాల్లో నంబర్ వన్గా తెలంగాణ
పథకాల అమలులో అధికారుల పాత్ర ఎంతో ముఖ్యం
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
ఎమ్మెల్యే అరూరితో కలిసి అధికారులతో సమావేశం
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
పర్వతగిరి, జనవరి 22 : సీఎం కేసీఆర్ దూర దృష్టితో ఆలోచించి తీసుకొచ్చిన పథకాల వల్లే దేశంలోనే తెలంగాణ అభివృద్ధిలో నంబర్వన్గా నిలుస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. శనివారం వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ నేతృత్వంలో పర్వతగిరి మం డల అభివృద్ధిపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలులో అధికారులు నిర్ల క్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని చె ప్పారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి అభివృద్ధికి బాసటగా నిలిచారన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి మొత్తం రూ.49 కోట్ల 62 లక్షలు మంజూరైనట్లు చెప్పారు. పర్వతగిరి మండలంలో సీసీ, బీటీ రోడ్లు, సీఆర్ఆర్, పీఎమ్జీఎస్వై రోడ్లకు రూ. 35 కోట్ల 36 లక్షలు, వర్ధన్నపేటకు రూ.2 కోట్ల 26 లక్షలు, హసన్పర్తి మండలానికి రూ. 8కోట్ల 15 లక్షలు, ఐనవోలు మండలానికి రూ. 3 కోట్ల 85 లక్షల మంజూరయ్యాయని తెలిపారు. పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రూర్బన్ మిషన్ ప్రాజెక్టు కింద ఎంపికైన పర్వతగిరి లో 191 పనుల్లో మరింత వే గం పెంచాలని సూచించారు. కాగా, 57 పనులు పూర్తయ్యాయని, 65 పనులు ప్రగతిలో ఉన్నాయని అధికారు లు చెప్పారు. అభివృద్ధి పనుల నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడొద్దన్నారు. స్థానిక ఎమ్మెల్యే విజ్ఞప్తి మేర కు మండలంలోని నూతన గ్రామ పంచాయతీలకు నిధులను మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో డీఆర్డీ వో సంపత్రావు, డీపీవో స్వరూప, డీఈవో వాసంతి, వి ద్యుత్ శాఖ ఏడీఈ చంద్రమౌళి, జడ్పీటీసీ సింగ్లాల్, పీఏసీఎస్ చైర్మన్ మనోజ్ కుమార్గౌడ్ పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..
మండలంలోని పలు గ్రామాలకు చెందిన బాధిత కు టుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి ఎర్రబె ల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ వేర్వేరుగా అం దజేశారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు రంగు కుమార్గౌడ్, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్రావు, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు సర్వర్, సర్పంచ్లు మాలతి, రాజు, రమేశ్, వెంకన్న నాయక్, తౌటి దేవేందర్, ఎంపీటీసీలు మోహన్రావు, మాడ్గుల రాజు, సుభాషిణి, మౌనిక, లావణ్య, ఉపసర్పంచ్ రంగు జనార్దన్, నాయకులు పాల్గొన్నారు.
పైడిపల్లి అభివృద్ధికి కృషి చేస్తా..
కాశీబుగ్గ : గ్రేటర్ వరంగల్లోని 3వ డివిజన్ పైడిపల్లి ప్రాంత అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. శనివారం పైడిపల్లిలో రూ. కోటి నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జన్ను షీభారాణి, రైతు బంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్ ఎల్లావుల లలితాయాదవ్, హనుమకొండ పీఏసీఎస్ చైర్మన్ ఇట్యాల హరికృష్ణ, నాయకులు పాల్గొన్నారు. అలాగే, టీఆర్ఎస్ పైడిపల్లి అధ్యక్షుడు పండుగ రవీందర్రెడ్డి తండ్రి సంజీవరెడ్డి శనివారం మృతి చెందగా, ఎమ్మెల్యే అరూరి బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు.