కొత్తకొండ వీరభద్రుడి జాతరకు పోటెత్తిన జనం
మొక్కులు చెల్లించుకున్న భక్తులు
కుమ్మరిబోనంతో ప్రధానఘట్టం ప్రారంభం
నేడు ఆలయం చుట్టూ ఎడ్లబండ్ల ప్రదక్షిణ
భీమదేవరపల్లి, జనవరి 13: కొత్తకొండ బ్రహ్మోత్సవా ల్లో భాగంగా శుక్రవారం భోగిపండుగ రోజున వీరభద్ర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తమ గండాలు తొలగిపోవాలని గండదీపం వద్ద నూనె పోశారు. కోరిన కోర్కెలు తీర్చాలని స్వామివారికి కోరమీసాలు సమర్పించారు. ఆలయ ప్రదక్షిణలు చేసి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలిరావడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. జాతరలోని రంగులరాట్నం, సర్కస్, దుకాణా సముదాయాలన్నీ రద్దీగా మారాయి. కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. జాతర ప్రత్యేకాధికారిగా నియమితులైన దేవాదాయ, ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వీరస్వామి భక్తుల సౌకర్యార్థం చేసిన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
కుమ్మరిబోనం..
కడిపికొండకు చెందిన కుమ్మరి వంశస్తులు ఆనవాయితీ ప్రకారం భోగి పండుగ రోజున ఆలయ సమీపంలో కుమ్మరి బోనం చేశారు. ఎడ్లబండ్లను రథాలుగా తీర్చిదిద్దారు. కుమ్మరిబోనం నెత్తిన పెట్టుకోగా డప్పుచప్పుళ్ల మధ్య శివసత్తులు నృత్యాలు చేశారు. వీరశైవులు ఖడ్గాలతో విన్యాసాలు చేశారు. కుమ్మరి బోనం నెత్తిన పెట్టుకుని ఆలయానికి వస్తుండగా వెనుక ఎడ్లబండ్ల రథాలు, శివసత్తుల నృత్యాలు, డప్పుచ ప్పుళ్లను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామి వారికి నైవేద్యం సమర్పించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వృక్షప్రసాదం పంపిణీ చేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఉచితంగా మొక్కలను అందజేస్తున్నారు. యాగశాలలో మహాలింగార్చన పూజలు జరిగాయి. 365 దీపా లతో వేదమంత్రోచ్ఛారణల మధ్య యాజ్ఞికులు తాటికొండ వినయ్శర్మ ఈ పూజలు నిర్వహించారు. మకర సంక్రాంతి రోజున స్వామివారిని దర్శించుకుంటే ఐష్టెశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నేడు ఎడ్లబండ్ల రథా లతో ఆలయ ప్రదక్షిణలు చేస్తారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ చైర్మన్ మాడిశెట్టి కుమారస్వామి, ధర్మకర్తలు ఎల్తూరి ప్రభాకర్, పెద్దబోయిన హరికృష్ణ, భూక్యా తులస్య, నోముల రాజు, మఠం శ్రీశైలం, ఈవో ఉడుతల వెంకన్న సదుపాయాలు కల్పించారు.