ఘనంగా గోదారంగనాథుల కల్యాణం
మొక్కులు చెల్లించుకున్న భక్తులు
పాల్గొన ప్రముఖులు..
గోవిందరావుపేట, జనవరి 14 : మండలంలోని పలు ఆలయాల్లో శుక్రవారం గోదారంగనాథుల స్వామి కల్యాణం ఘనంగా నిర్వహించారు. మండలంలోని చల్వాయిలో నిర్వహించిన కల్యాణ మహోత్సవంలో ఎంపీటీసీ చాపల ఉమనరేందర్రెడ్డి దంపతులు, గోవిందరావుపేటలోని కోదండరామాలయంలో జరిగిన క ల్యాణంలో పలువురు దంపతులు కూర్చోగా, వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య కల్యాణం జరిపించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మంగపేట: మండలంలోని బోరునర్సాపురం, కమలాపురం, చెరుపల్లి తదితర గ్రామాల రామాలయాల్లో శుక్రవారం అర్చకులు కనుల పండువగా గోదారంగనా థుల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలయ అర్చకుడు జీ మధుసూదనాచార్యులు, గౌరవ అధ్యక్షురాలు కొల్లి దేవకి, ఆలయ కమిటీ అధ్యక్షుడు నర్రా శ్రీధర్, కార్యదర్శి కడియాల సుదర్శన్, పూసాల సరోజన, పసుపులేటి రాజశేఖర్, వీ చినబాబు, మన్నెం నాగేశ్వర్రావు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పట్టాభి రామస్వామి దేవాలయంలో..
గణపురం: ధనుర్మాసోత్సవాల్లో భాగంగా గణపురం మండలంలోని గణపురం, చెల్పూర్, బుద్దారం గ్రామలలోని దేవాలయంలో భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీపట్టాభిరామాలయంలో శుక్రవారం గోదారం గనాథుల కల్యాణం నేత్రపర్వంగా నిర్వహించారు. మండలంలోని భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పట్టాభి రామస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు గోవర్ధన దూర్వస చార్యులు, శ్రీనివాసాచార్యులు పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం గణపురం మండలకేంద్రంలోని కాకతీయు ల కళాక్షేత్రం శ్రీ భవానీ సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో కోటగుళ్లకు భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని మహిళలు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించరు. మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్య లో భక్తులు భారీగా తరలి వచ్చి స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు నరేశ్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న గోమాతలకు పూజలు చేసి మహిళలు పండ్లను అందజేశారు. పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు నరేశ్ తీర్థప్రసాదాలను భక్తులకు అందజేశారు.
సీతారామచంద్ర స్వామి ఆలయంలో..
కాళేశ్వరం: కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి అనుబంధ ఆలయం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ఆలయంలో గోదారంగనాథ స్వామి వారి కల్యాణం అర్చకులు ఘనంగా నిర్వహించారు. అనంతరం గోదారంగనాథ స్వామి కల్యాణం విశిష్టతను అర్చకులు భక్తులకు వివరించారు. భక్తులకు తీర్థ ప్రాసాదాలు అందజేశారు. ఎంపీటీసీ మమత, సర్పంచ్ వసంత పాల్గొన్నారు.
లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ..
రేగొండ: సుప్రసిద్ద లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంక్రాంతి, బోగి పండుగ పర్వదినాని పురష్కరించుకుని మండలంలోని కొడవటంచ గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.