గడువులోగా పూర్తి చేయాలి
లేకపోతే అధికారులపై చర్యలు
అడిషనల్ కలెక్టర్ హరిసింగ్
వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో పర్యటన
‘పల్లెప్రగతి’ పనుల పరిశీలన
వర్ధన్నపేట, జనవరి 12 : వర్ధన్నపేట మున్సిపల్ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ బీ హరిసింగ్ సూచించారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. పట్టణ పరిధిలో రూ.30 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులు, పాలక మండలితో చర్చించారు. ప్రధానంగా పట్టణ ప్రజలకు అందుతున్న తాగునీరు, పారిశుధ్యం, పట్టణశుద్ధి, చెత్త తరలింపు, వీధి దీపాలు, డ్రైనేజీ తదితర సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. కౌన్సిలర్లు పలు సమస్యలను అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అంతేకాక వసూలైన పన్నులు, బకాయిలపై చర్చించారు. వంద శాతం పన్నులు వసూలు చేయాలని సూచించారు. హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ గొడిశాల రవీందర్, వైస్చైర్మన్ కోమాండ్ల ఎలేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గడువులోగా పూర్తి చేయాలి..
రాయపర్తి : గ్రామాల సమగ్రాభివృద్ధే ప్రధా న లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగ తి కార్యక్రమాలన్నింటినీ గడువులోగా పూర్తి చేసేందుకు పంచాయతీరాజ్ అధికారులు, సి బ్బంది కృషి చేయాలని అదనపు కలెక్టర్ బానో త్ హరిసింగ్ ఆదేశించారు. బుధవారం మండ ల కేంద్రంలో పర్యటించారు. బృహత్ పల్లె ప్ర కృతి వనం, డంపింగ్ యార్డు, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, నర్సరీని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గుగులోత్ కిషన్నాయక్, ఎంపీవో తుల రామ్మోహన్, సర్పంచ్ గారె నర్సయ్యతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీవో దొణికెల కుమార్గౌడ్, పంచాయతీ కార్యదర్శులు గుగులోత్ అశోక్నాయక్, కారోబార్ కారుపోతుల రాం చంద్రయ్య, కిషన్రెడ్డి పాల్గొన్నారు.