స్వచ్ఛందంగా లాక్డౌన్ వైపు మొగ్గు
గ్రామ, పట్టణ పెద్దల సూచనలతో ప్రత్యేక చర్యలు
జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం వరకే వ్యాపారాలు
జయశంకర్ భూపాలపల్లి, మే 6(నమస్తేతెలంగాణ) : కరోనా రెండో విడుత వ్యాప్తి వేగవంతమవుతూ ప్రాణాలను తీస్తుండగా దాని కట్టడికి పల్లె, పట్నం తేడా లేకుండా ప్రజలు నడుం బిగిస్తున్నారు. ప్రభుత్వం సూచిస్తున్న నిబంధనలను పాటిస్తూ స్వీయ నిర్బంధాలను విధించుకుంటున్నారు. జిల్లాలోని రేగొండ మండలం సుల్తాన్పూర్లో ఆరు రోజుల వ్యవధిలోనే 25 మందికి కరోనా సోకడంతో గ్రామంలో స్వచ్ఛందంగా లాక్డౌన్ను విధించుకున్నారు. మహదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరంలో పలువురికి వైరస్ సోకడంతో పంచాయతీ తీర్మానం మేరకు లాక్డౌన్ పెట్టుకున్నారు. మల్హర్రావు మండలంలోని పెద్దతూండ్లలోనూ పాజిటివ్ కేసులు నమోదుకావడంతో గ్రామంలోని వర్తక, వ్యాపారులు మధ్యాహ్నం 12 గంటల వరకే వ్యాపారాలు నిర్వహించాలని తీర్మానం చేసి, అమలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ వారు స్వయంగా రంగంలోకి దిగి తమ వ్యాపారాలను మధ్యా హ్నం 2 గంటల వరకే నిర్వహించాలని మూకుమ్మడిగా నిర్ణయించి గురువారం నుంచి అమలు చేస్తున్నారు.