పరిసరాల పరిశుభ్రత పాటించాలి
అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
కృష్ణకాలనీ/భూపాలపల్లిరూరల్/ గణపురం/ కాటారం, జూలై 4: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఆదివారం భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 30వ వార్డు రెడ్డి కాలనీలో కౌన్సిలర్ మాడ కమల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పట్టణ ప్రగతిపై అవగాహన ర్యాలీ నిర్వహించగా అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ర్యాలీని ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డులో కలియ తిరిగి వార్డు ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూపాలపల్లి పట్టణంలో ప్రజలందరూ తమ వంతు బాధ్యతగా ఇంటి పరిసరాలతోపాటు, వార్డును పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంట్లో ఉన్న తడిపొడి చెత్తను వేరు చేసి ఇంటి ముందుకు వచ్చే చెత్త వాహనంతో వేయాలన్నారు. ప్రజలందరూ తమ ఇండ్ల చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలని, మొక్కలను పెంచుకోవాలని అన్నారు. వార్డులో ఎలాంటి సమస్యలున్నా సంబంధిత వార్డు కౌన్సిలర్ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కారమవుతాయని అన్నారు. కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్దు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, కౌన్సిలర్లు మేకల రజిత, నాగవెల్లి సరళ, టీజేఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాడ హరీశ్రెడ్డి, 30వ వార్డు స్పెషల్ ఆఫీసర్ రవికుమార్, టీపీవో అవినాష్, 30వ వార్డు ప్రజలు పాల్గొన్నారు.
పచ్చదనంలో పట్టణం కళ కళలాడాలి
భూపాలపల్లి పట్టణంలో పచ్చదనం, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. పట్టణ ప్రగతి నాలుగవ రోజులో భాగంగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు మంజూర్నగర్ మెయిన్ రోడ్డులో జరుగుతున్న శానిటేషన్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పాడుబడిన ఇండ్లను, బావులను పూడ్చివేయాలని, దోమలు, ఈగలు వృద్ధి చెందకుండా చూడాలని అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్దు, మున్సిపల్ వైస్ ఛైర్మన్ కొత్త హరిబాబు, కమిషనర్ శ్రీనివాస్, ఏఈ రోజారాణి, నవీన్, వార్డు ఆఫీసర్ సంకటి సదానందం తదితరులు పాల్గొన్నారు.
ముమ్మరంగా పల్లెప్రగతి పనులు
గణపురం మండలంలోని కుందయ్యపల్లి శివారు ప్రధాన రహదారిపై నిర్వహిస్తున్న పల్లెప్రగతి పనులను అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పల్లెప్రగతిలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కలిసి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని అన్నారు. పల్లెప్రకృతి వనం, డంపింగ్ యార్డు, శ్మశానవాటికల చుట్టూ బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతి ఇంటికీ ఆరు మొక్కలను పంపిణీ చేసి వాటి వివరాలను నమోదు చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో లెంకల అరుంధతి, ఎంపీవో రామకృష్ణ, డివిజనల్ పంచాయతీ అధికారి సుధీర్కుమార్, పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ నరేశ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు నగేశ్, నారగాని దేవేందర్ గౌడ్, నడిపెల్లి మధుసూదన్రావు, చెరుకు కుమారస్వామి, మామిడి రవి తదితరులు పాల్గొన్నారు.
పల్లెప్రగతి పనులు పూర్తి చేయాలి
పల్లెప్రగతి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. కాటారం మండలపరిధిలోని జాతీయ రహదారికి ఇరువైపులా మేడిపల్లి నుంచి కాటారం జీపీ వరకు పరిశీలించారు. కాటారం జీపీ పరిధిలోని పల్లె ప్రకృతి వనాలను తనిఖీ చేశారు. సబ్స్టేషన్పల్లిలో పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. గ్రామాల్లో అపరిశుభ్రత ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పర్యటనకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇబ్రహీంపల్లి, బయ్యారంలో పారిశుధ్య పనులను జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత పరిశీలించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి అక్బర్, ఎంపీడీవో శంకర్, ఎంపీవో మల్లికార్జున్రెడ్డి, ఎంపీటీసీ తోట జనార్దన్, సర్పంచ్ రఘురాం, సంధ్య, ఉపసర్పంచ్ నాయిని శ్రీనివాస్, జీపీ స్పెషల్ ఆఫీసర్ అభిషేక్, జీపీ కార్యదర్శులు షగీర్ఖాన్, జ్యోత్స్న, స్టీవెన్, రజిత తదితరులు పాల్గొన్నారు.