కృష్ణకాలనీ, ఫిబ్రవరి 1: జయశంకర్ భూపాలపల్లి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షురాలిగా నియమితులైన వరంగల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతిరెడ్డిని భూపాలపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, టీఆర్ఎస్ జిల్లా అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్ పటేల్, అర్బన్ మాజీ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్కుమార్ యాదవ్, కౌన్సిలర్ల ఫోరం అధ్యక్షుడు శిరుప అనిల్, భక్తాంజనేయ దేవాలయ చైర్మన్ గడ్డం కుమార్రెడ్డి, టీఆర్ఎస్ ఎస్సీ సెల్ అర్బన్ అధ్యక్షుడు మోకిడి అశోక్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు బుర్ర రమేశ్, టీజేఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాడ హరీశ్రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గండ్ర దంపతులు మాట్లాడుతూ.. ఈ నెల 7న మంత్రులు కల్వకుంట్ల తారకరామారావుతో పాటు ఎర్ర బెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, వేముల ప్రశాంత్రెడ్డి, గంగుల కమలాకర్, జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు జిల్లాకు వస్తు న్నారని, వారికి టీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, అర్బన్ కమిటీ నాయకులు బీబీ చారి, బుర్ర సదానందం, మంతెన రాజేశ్వర్, పుట్ట రవి, బడితల సతీశ్, అర్బన్ యూత్ కమిటీ నాయకులు, అర్బన్ మహిళా నాయకులు పాల్గొన్నారు
‘రైతుబంధు’క్యాలెండర్ ఆవిష్కరణ
కృష్ణకాలనీ: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో తెలంగాణ రైతు బంధుసమితి 2022 క్యాలెండర్ను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆవిష్కరిం చారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ్ భాస్కర్, రైతుబంధు సమితి సభ్యులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.