10 రోజులకే ఊడిపోతున్న తారు
నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్
తూతూ మంత్రంగా బీటీ ప్యాచ్ వర్క్
చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధుల డిమాండ్
గోవిందరావుపేట, జనవరి 31 : పర్యాటక ప్రాంతంగా వెలుగొందుతున్న లక్నవరం సరస్సు పర్యాటకులు వెళ్తేందుకు ఇటీవల బీటీ రోడ్డు నిర్మించారు. గతుకుల రోడ్డుతో ఇబ్బంది పడిన ప్రజలు, పర్యాటకులు కొత్త రోడ్డును చూసి మురిసిపోయారు. కానీ, ఆ సంతోషం ఎంతో కాలం నిలువులేదు. రోడ్డు వేసిన పది రోజులకే పెచ్చులూడుతుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాలలోకి వెళితే… మండలంలోని బుస్సాపురం గ్రామం నుంచి లక్నవరం సరస్సు పార్కింగ్ స్థలం వరకు నూతనంగా బీటీ రోడ్డు నిర్మించేందుకు కలెక్టర్ కృష్ణఆదిత్య ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పర్యాటకులకు ఇబ్బందులు తలెత్తవద్దనే లక్ష్యంతో మేడారం జాతర నిధుల నుంచి రూ. 1.48కోట్లు వెచ్చిం చి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. 3 కిలో మీటర్ల రోడ్డు వేసేందుకు రూ. 1.30 కోట్లు, చల్వాయి నుంచి బుస్సాపురం వరకు ప్యాచ్ వర్క్ చేపట్టేందుకు రూ.18 లక్ష లు కేటాయించారు. ఇంత వరకు బాగా నే ఉన్నా ప్యాచ్ వర్క్ మా త్రం తూతూ మంత్రంగా చేపట్టారు. 20 రోజుల్లో తూతూ మంత్రంగా పనులు పూర్తి చేశా రు. ఇటీవల సరస్సు కట్టపై వాహనాల రాకతో ఒక్క సారిగా తారు లేచిపోయి మెటల్ రోడ్డు దర్శనమిస్త్తోంది. రోడ్డు వేసిన 10 రోజులకే తారు లేచిపోవడంపై లక్నవరం సందర్శనకు వచ్చే పర్యాటకులు ‘ఇదేం రోడ్డు’..! అని ముక్కున వేలేసుకుంటున్నా రు. స్థానిక సర్పంచ్తో పాటు పాలకవర్గం రోడ్డు నాణ్యత తో చేపట్టాలని సూచించినప్పటికీ రాత్రికి రాత్రే రోడ్డు పను లు పూర్తి చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు లేకుండానే..
బీటీ రోడ్డు నిర్మించే క్రమంలో సంబంధిత అధికారులు ఉండాలి. కానీ, అవేవి పట్టించుకోకుండా కాంట్రాక్టర్ తన ఇష్టానుసారం బీటీ రోడ్డును నిర్మించాడనే ఆరోపణలున్నా యి. రోడ్డు నిర్మాణం 3 రోజుల్లో పూర్తయినప్పటికీ పనులు జరుగుతున్న సమయంలో సంబంధిత అధికారులు ఉండకపోవడం కొసమెరుపు. నాణ్యతాప్రమాణాలు పాటించడం లేదని సదరు ప్రజాప్రతినిధులు ఫోన్ చేసినప్పటికీ కాంట్రాక్టర్ ఫోన్ లిప్ట్ చేయలేదనే ఆరోపణలున్నాయి.
కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలి
నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్పై అధికారులు చర్యలు తీసుకోవాలని సర్పంచ్ సింగం శ్రీలత, ఉప సర్పంచ్ బేతి దేవేందర్రెడ్డి అన్నారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ గత శనివారం రోడ్డు నిర్మాణం చేపడుతుండగా ఆదివారం పర్యాటకులు వచ్చే క్రమంలో రోడ్డు వేయకుండా పనులు నిలిపివేయాలని కాంట్రాక్టర్ను కోరినప్పటికీ పనులు ఆపకుండా సుమారు 1.5 కిలో మీటర్ల వరకు నిర్మించాడని అన్నారు. ప్యాచ్ వర్క్ పనుల్లోనూ నాణ్యతాప్రమాణాలు పాటించలేదన్నారు. పాత రోడ్డును తొలగించి నూతన మెటల్ రోడ్డు వేయాల్సి సిమెంట్ వాడకుండానే కంకరతో బీటీ వేశాడని ఆరోపించారు.