జనగామలో నిర్వహించిన ‘కాకతీయ స్టేట్ లెవెల్ కబడ్డీ చాంపియన్ షిప్-2021’ పోటీలు గురువారం ముగిశాయి. మహిళల విభాగంలో వరంగల్ జట్టు, పురుషుల విభాగంలో నల్లగొండ జట్టు విజేతలుగా నిలిచాయి. ముందుగా సెమీ ఫైనల్స్ పురుషుల విభాగంలో నల్లగొండ -రంగారెడ్డి జట్లు తలపడగా, నల్గొండ జట్టు 36-35 స్కోరుతో రంగారెడ్డి జట్టుపై విజయం సాధించి ఫైనల్కు చేరింది. వరంగల్-మహబూబ్నగర్ జట్లు తలపడగా, వరంగల్ జట్టు 35-33 స్కోరుతో ఫైనల్కు చేరింది. మహిళల విభాగంలో ఏసీపీ స్టేషన్ ఘన్పూర్-11 వర్సెస్, జనగామ-11 జట్లు తలపడగా, ఏసీపీ స్టేషన్ ఘన్పూర్ జట్టు 46-34 స్కోర్తో సీపీ జనగామ జట్టుపై విజయం సాధించి ఫైనల్కు చేరింది. డీసీపీ జనగామ-11, ఏసీపీ జనగామ-11 జట్లు తలపడగా, డీసీపీ జనగామ జట్టు 32-22 స్కోర్తో ఏసీపీ జనగామ జట్టుపై విజయం సాధించి ఫైనల్కు చేరింది.
హోరీహోరీగా ఫైనల్స్
ఫైనల్ పోటీలు హోరాహోరీగా జరిగాయి. నల్గొండ -వరంగల్ జట్లు తలపడగా, నల్లగొండ జట్టు 40-30 స్కోరుతో వరంగల్ జట్టుపై గెలిచింది. బాలికల విభాగంలో హైదరాబాద్ (ఏసీపీ స్టేషన్ ఘన్పూర్-11), వరంగల్ (డీసీపీ జనగామ-11) జట్లు తలపడ గా, వరంగల్ జట్టు 35-30 స్కోరుతో విజయబావుటా ఎగురవేసింది. ప్రథమ స్థానంలో నిలిచిన రెండు జట్లకు రూ.60వేల చొప్పున నగదుతో పాటు ట్రోఫీని సీపీ తరుణ్ జోషి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అంద జేశారు. ద్వితీయ స్థానంలో నిలిచిన జట్లకు రూ.40వేల నగదు, ట్రోఫీని బహూకరించారు. తృతీయ స్థానంలో నిలిచిన మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ (ఏసీపీ జనగామ), రంగారెడ్డి (సీపీ జనగామ) జట్లకు రూ. 20 వేల చొప్పున నగదు, ట్రోఫీలను అందించా రు.
కార్యక్రమంలో జనగామ అదనపు కలెక్టర్లు ఏ భాస్కర్రావు, అబ్దుల్ హమీద్, వైభవ్ గైక్వాడ్ ఐపీఎస్, వరంగల్ ఈస్ట్జోన్ డీసీపీ వెంకటలక్ష్మి, సెంట్రల్ జోన్ డీసీపీ పుష్ప, జనగామ ఏసీపీ జీ కృష్ణ, స్టేషన్ ఘన్పూర్ ఏసీపీ రఘుచందర్, వర్ధన్నపేట ఏసీపీ జీ రమేశ్, జనగామ అర్బన్ సీఐ పీ బాలాజీ వరప్రసాద్, నర్మెట సీఐ ఎం కరుణాకర్, రఘునాథపల్లి సీఐ వినయ్ కుమార్, స్టేషన్ ఘన్పూర్ సీఐ శ్రీనివాస్రెడ్డి, ఎస్ఐలు రుక్మాచారి, కే శ్రీనివాస్, సీహెచ్ రవి కుమార్, ప్రవీణ్, అనిల్, సాయి దివ్య, జనగామ మున్సిపల్ చైర్మన్ పోకల జమున, జనగామ ప్రధాన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ పీ సుగుణాకర్రాజు, డాక్టర్ సీహెచ్ రాజమౌళి, డాక్టర్ సుల్తాన్ రజా, డాక్టర్ బాలాజీ, రెఫరీస్ బోర్డ్ రాష్ట్ర కన్వీనర్ బీ అనిల్ కుమార్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు పోగుల సారంగపాణి, కబడ్డీ అసోసియేషన్ జిల్లా చైర్మన్ వై కుమార్గౌడ్, సెక్రటరీ తోటకూరి గట్టయ్య, పీఈటీలు ఎల్ సత్యనారాయణ, తోటకూరి వెంకటేశ్వర్లు, ఎన్ కుమార్, ఖుద్దూస్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.