నర్సంపేట/వర్ధన్నపేట/దుగ్గొండి/నల్లబెల్లి/నర్సంపేటరూరల్/చెన్నారావుపేట/సంగెం/ఖానాపురం/పోచమ్మమైదాన్/కాశీబుగ్గ, సెప్టెంబర్ 27: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను మంగళవారం వాడవాడలా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. నర్సంపేటలోని మున్సిపల్ కార్యాలయంలో లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్ పూలమాల వేసి నివాళులర్పించారు. కౌన్సిలర్లు పాల్గొన్నారు. వర్ధన్నపేట మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, అధికారులు లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, వైస్ చైర్మన్ ఎలేందర్రెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
దుగ్గొండి మండలవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు, కార్యాలయాల్లో లక్ష్మణ్ బాపూజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, గిర్నిబావి ఎంజేపీటీ గురుకులంలో ప్రత్యేకాధికారి కూరోజు దేవేందర్ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నల్లబెల్లిలో పద్మశాలి సంఘం సభ్యులు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని నిర్వహించారు. ఎస్సై నార్లాపురం రాజారాం, సర్పంచ్ నానబోయిన రాజారాం పాల్గొన్నారు. నర్సంపేట తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ వాసం రామ్మూర్తి, రామవరం జీపీలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కొడారి రవన్న బాపూజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. చెన్నారావుపేటలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో లక్ష్మణ్ బాపూజీ జయంతి నిర్వహించారు. సంఘం జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు. సంగెం మండల పరిషత్ కార్యాలయంలో లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి ఎంపీపీ కళావతి పూలమాల వేసి నివాళులర్పించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఖానాపురం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించారు. ఎంపీడీవో సుమనావాణి, రామసహాయం ఉపేందర్రెడ్డి, సర్పంచ్ అశోక్, కార్యదర్శులు పాల్గొన్నారు. చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కొత్తవాడలోని అమరవీరుల స్తూపం వద్ద లక్ష్మణ్ బాపూజీ జయంతి నిర్వహించారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వడ్నాల నరేందర్, డీఎస్మూర్తి, దాసరి జనార్దన్, మాజీ కార్పొరేటర్లు దామెర సర్వేష్, యెలుగం శ్రీనివాస్, దువ్వల రాజేందర్, కూరపాటి సంపత్, మండల శంకర్, సిరబోయిన రాజు, గాదె రవీందర్, బస్వరాజు మల్లేశం, తుమ్మ రమేశ్ పాల్గొన్నారు. 21వ డివిజన్ ఎల్బీనగర్లోని పద్మశాలి ట్రస్ట్ భవనంలో అధ్యక్షుడు సుంకనపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించారు. ట్రస్ట్ సభ్యులు ఆకెన వెంకటేశ్వర్లు, గాదె ప్రభాకర్, బింగి మహేశ్, మార్గం ఎల్లయ్య, కోమాకుల నాగరాజు పాల్గొన్నారు. కాశీబుగ్గ 3వ డివిజన్ ఆరెపల్లిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి నిర్వహించారు. సహాయ పరిశోధనా సంచాలకుడు డాక్టర్ ఆర్ ఉమారెడ్డి, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
మహనీయుల త్యాగాలు స్ఫూర్తిదాయకం
ఖిలావరంగల్: మహనీయుల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ గోపి అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో కలిసి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతంలో పుట్టిన ఆయన తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేశారన్నారు. లక్ష్మణ్ బాపూజీ త్యాగాలు, పోరాటాలను ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ స్వరాష్ట్రంలో మహనీయుల జయంతి, వర్ధంతుని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని కొనియాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీవత్స కోట, బీ హరిసింగ్, ఆర్డీవో మహేందర్జీ, ఏవో శ్రీకాంత్ పాల్గొన్నారు.