సంగెం, మే 10: ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నారని, సీఎం రిలీఫ్ ఫండ్ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్నదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సంగెం, గీసుగొండ, ఖిలావరంగల్ మండలాలకు చెందిన పలువురు ఇటీవల అనారోగ్యంతో ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొందారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పది మందికి రూ. 3,06,500 విలువైన చెక్కులు మంజూరయ్యాయి. ఈ మేరకు హనుమకొండలోని తన నివాసంలో ఎమ్మెల్యే ధర్మారెడ్డి బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేశారు. సంగెం మండలంలో రూ. 57 వేలు, గీసుగొండ మండలంలో రూ. 1,32,000, ఖిలావరంగల్ మండలానికి చెందిన వారికి రూ. 1,17,500 మంజూరు కాగా, చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ ఆపత్కాలంలో ఎంతో మంది నిరుపేదలను ఆదుకుంటున్నదని తెలిపారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తూ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తున్నదని కొనియాడారు. కార్పొరేటర్ గద్దె బాబు, నాయకులు బాబురావు, రామారావు, వేణు, శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ ప్రకాశ్ పాల్గొన్నారు.
అవార్డు గ్రహీతకు సన్మానం
ఖిలావరంగల్: తూర్పుకోటకు చెందిన మాజీ కార్పొరేటర్ బిళ్ల శ్రీకాంత్ను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మంగళవారం సన్మానించారు. 13 ఏళ్లుగా భవన నిర్మాణ కార్మికులకు సేవలు అందిస్తున్నందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మేడే సందర్భంగా శ్రీకాంత్కు శ్రమశక్తి అవార్డు అందించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎమ్మెల్యే శ్రీకాంత్ను సన్మానించారు. కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ కార్పొరేటర్ సుంకరి శివ, 17వ డివిజన్ కార్పొరేటర్ గద్దె బాబు, ఆర్బీఎస్ గ్రామ కో ఆర్డినేటర్ తరిగెల ప్రసాద్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భూమాత పాల్గొన్నారు.