జనగామ : కార్యకర్తలే పార్టీకి వెన్నుదన్నుగా భావించిన సీఎం కెసీఆర్ కార్యకర్తతో పాటు వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పార్టీ సభ్యత్వం పొందిన కార్యకర్త పేరున ఉచిత బీమా చేసిన పార్టీ దేశంలో ఎక్కడ లేదన్నారు. 60 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీ కూడా లేదన్నారు. టీఆర్ఎస్ సభ్యత్వం పొందిన కార్యకర్త మరణిస్తే వారి కుటుంబానికి ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు అందిస్తున్నదని మంత్రి చెప్పారు.
కడవెండి, నల్లకుంట తండా, మాదాపురం లకావత్ తండా గ్రామాలకు చెందిన కార్యకర్తలు భాషిపాక నర్సయ్య, భానోత్ రంగ్యా, లకావత్ దేవులా ప్రమాదంలో మరణించాగ వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చెక్కులను మంత్రి అందచేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తీగల దయాకర్, ప్రధాన కార్యదర్శి చింత రవి, ఎంపీపీ బస్వ సావిత్రి మల్లేశం, నాయకులు తదితరులు పాల్గొన్నారు.