స్టేషన్ ఘన్పూర్: ఎస్సీ కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే రాజయ్యను కోరారు. మంగళవారం హన్మకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. అనంతరం మండలంలోని మీదికొండ గ్రామానికి ఎస్సీ కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని ఎమ్మెల్యేను కోరారు.
ఈ కార్యక్రమంలో జడ్పీస్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, ఎంపీపీ కందుల రేఖ గట్టయ్య, మండల ఉపాధ్యక్షుడు పొన్నం రంజిత్, మండల యూత్ సెక్రటరి జోగు వినయ్కుమార్, గ్రామశాఖ అధ్యక్షుడు గొడుగు సంజీవ, యూత్ అధ్యక్షులు జోగు సురెంధర్, జోగు యాకయ్య, యేసు, రాంచంధర్, సుద్దాల అనిల్ తదితరులు పాల్గొన్నారు