స్టేషన్ ఘన్పూర్: నియోజకవర్గ కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఎమ్మెల్యే రాజయ్య భూమి పూజ చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో గతంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించారు. ఆదివారం 50 లక్షల నిధులతో నూతన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు తాటికొండ సురేష్ ఆహ్వనం మేరకు ఎమ్మెల్యే డా. రాజయ్య ముఖ్యఅతిధిగా హజరై భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రంలో సుమారు 13 వేల జనాభా ఉందని, రానున్న రోజుల్లో మున్సిపాలిటి కానుందని అన్నారు. రెండు కోట్ల కు పైగా నిధులతో సిసి రోడ్లు, సైడ్ డ్రైనేజ్లు నిర్మించుకోవడం జరిగిందన్నారు.
కూడా నిధులతో బీటి రోడ్లు వేసుకోవడం జర్గిందని, ఆర్సియం చర్చి నుంచి జాతీయ రోడ్డు వరకు15 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణం త్వరలో వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటి చైర్మన్ మారపాక రవి, కూడా డైరెక్టర్ ఆకుల కుమార్, ఎంపిపి కందుల రేఖా గట్టయ్య, ఉప సర్పంచ్ నీల ఐలయ్య, ఎంపిటీసీలు సింగపురం దయాకర్, గన్ను నర్సింహులు, మునిగెల రాజు, ఎంపిడీవో కుమారస్వామి, వార్డు సభ్యులు, పట్టణ అధ్యక్షుడు మునిగెల రాజు, ఆర్ అండ్ బి వర్క్ ఇన్స్పెక్టర్ నాగరాజు, మాతంగి దేవయ్య, గుర్రంశంకర్ పాల్గొన్నారు.