జనగామ చౌరస్తా : విదేశాలలో ఉన్నత విద్య (పోస్ట్ గ్రాడ్యుయేషన్/డాక్టోరల్) అభ్యసించే అర్హులైన మైనార్టీ విద్యార్థులు ఆన్లైన్లో డిసెంబర్ 30వ తేది వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి సయ్యద్ ఇస్మాయిల్ ఒక ప్రకటనలో తెలిపారు. యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్ వంటి దేశాలలో జనవరి 2021 నుంచి డిసెంబర్ 2021 (స్ప్రింగ్, ఫాల్ సీజన్ 2021) వరకు ఎంపికై అడ్మిషన్ పొంది ఉండాలని సయ్యద్ ఇస్మాయిల్ పేర్కొన్నారు. www.telanganaepass.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ స్కాలర్షిప్ కోసం మైనార్టీ విద్యార్థిని, విద్యార్థుల వయసు అక్టోబర్ 26వ తేది 2021 నాటికి 35 సంవత్సరాలకు మించి ఉండరాదన్నారు. తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం రూ. 5లక్షలు మించి ఉండకూడదని తెలిపారు.
అదే విధంగా విద్యార్థి ఆధార్కార్డు, మైనార్టీ కుల ధృవీకరణ పత్రం, డిగ్రీ/ ఇంజినీరింగ్లో 60శాతం మార్కులు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 60శాతం మార్కులు పొంది పీహెచ్డీ చేయాలనుకునే వారు అర్హులు అని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి కార్యాలయం నంబర్ 7993357081, 9951933034లను సంప్రదించాలని తెలిపారు.