స్టేషన్ ఘన్పూర్, నవంబర్ 25 : భారత రాజ్యాంగంలో ఒక్క దళితుల కోస మే కాకుండా, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఎమ్మెల్యే రాజయ్య కొనియాడారు. డివిజన్ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేశ్ ఆధ్వర్యంలో శుక్రవారం అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాభిషేకం చేశారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలకు క్షీరాభిషేకం, చిత్రపటాలకు పుష్పాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే తను ఉప ముఖ్యమంత్రి అయ్యానని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ప్రకారం కేసీఆర్ తెలంగాణను సాధించినట్లు తెలిపారు. డివిజన్ కేంద్రంలోని బస్టాండు సమీపంలో జాతీయ రహదారి విస్తరణలో భాగంగా తొలగించిన అంబేద్కర్ విగ్రహం స్థానంలో నేడు (శనివారం) అంబేద్కర్ విగ్రహ పున:ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు.
ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అంబేద్కర్ వాదులు, టీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ సురేశ్, జడ్పీటీసీ మారపాక రవి, ఎంపీపీ కందుల రేఖాగట్టయ్య, మండల వైస్ఎంపీపీ చల్లా సుధీర్రెడ్డి, కొత్తపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ గోవిందు ఆనందం, రఘునాథపల్లి మండల పార్టీ అధ్యక్షుడు వారాల రమేశ్, గోవిందు అశోక్, మారపల్లి ప్రసాద్, గుండె మల్లేశ్, వారణాసి రామకృష్ణ, గుండె రంజిత్, సోషల్ మీడియా వారియర్స్ వినయ్, చిరంజీవి, చెవుల యాదగిరి, టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్..
లింగాలఘనపురం : అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తోంది ఒక్క సీఎం కేసీఆరేనని ఎంపీపీ చిట్ల జయశ్రీఉపేందర్రెడ్డి అన్నారు. రాజ్యాంగ అమలు దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని అంబేద్కర్ విగ్రహాలకు టీఆర్ఎస్ శ్రేణులు స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఆదేశాలతో పూలమాలలు వేసి శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. లింగాలఘనపురంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ మాట్లాడారు. చిన్న రాష్ర్టాల ఏర్పాటుతోనే అభివృద్ధి జరుగుతుందని అంబేద్కర్ తలిచేవారన్నారు. అందుకణుగుణంగా సీఎం కేసీఆర్ ఉద్యమించి స్వరాష్ర్టాన్ని సాధించారన్నారు. కొట్లాడి సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చి దిద్దుతున్నారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బొల్లంపెల్లి నాగేందర్, ఉడుగుల భాగ్యలక్ష్మి, గవ్వల మల్లేశం,ఎడ్ల రాజు, కేమిడి యాదగిరి, కారంపురి శ్రీనివాస్, లింగాల వెంకటేశ్, జానీమియా, గూటం రవి, తీ గల సిద్ధ్దూగౌడ్, గట్టగల్ల శ్రీహరి, గండి శ్రీ నివాస్, బోయిని యాకూబ్ పాల్గొన్నారు.
రఘునాథపల్లిలో..
రఘునాథపల్లి : మండల కేంద్రంతోపా టు ఆయా గ్రామాలు, పాఠశాలల్లో రా జ్యాంగం అమలు దినోత్స వేడుకలను శు క్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సం దర్భంగా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలు, చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘనంగా వేడుకలను జరుపుకున్నారు. ప లు పాఠశాలల్లో రాజ్యాంగం ప్రాముఖ్యత లో అంబేద్కర్ పాత్ర అనే అంశంపై వ్యాస రచన పోటీలు నిర్వహించి, ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదా నం చేశారు. కార్యక్రమంలో ఆయా గ్రా మాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉపాధ్యాయులు, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
చిల్పూరులో..
చిల్పూరు : మండలంలోని పల్లగుట్ట చౌరస్తాలో శుక్రవారం ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు, ఎంపీపీ బొమ్మిశెట్టి సరితబాలరాజు, సర్పంచ్ బొట్టు మానస ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూక్యా రమేశ్నాయక్, మండల ఉపాధ్యక్షుడు వేల్పుల గట్టయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు రత్నాకర్రెడ్డి, మార్కెట్, దేవస్థానం డైరెక్ట ర్లు చల్లరపు శ్యాంసుందర్రెడ్డి, రంగు హరీశ్, బత్తుల రాజన్బాబు, పార్టీ సీనియర్ నాయకులు మారబొయిన ఎల్ల య్య, జీడి ఆనందం, మాజీ సర్పంచ్ బొట్టు చేరాలు, జీడి జాన్, దారం అనిల్పాల్, రాజు, కోర్నేలు పాల్గొన్నారు.
జఫర్గఢ్లో..
జఫర్గఢ్ : రాజ్యాంగ అమలు దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్థాని క ప్రజాప్రతినిధులు, నాయకులు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఎంపీపీ రడపాక సుదర్శన్, జడ్పీటీసీ ఇల్లందుల బేబి, మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు, సర్పంచ్ వెంకటనరసింహరావు, ఎంపీటీసీ రజిత, స్రవంతి, పీఏసీఎస్ వైస్చైర్మన్ నరసింగం పాల్గొన్నారు.