రేగొండ(గణపురం) జూన్ 7: ప్రభుత్వం ప్రతి ష్టాత్మ కంగా అమలు చేస్తున్న ‘మన ఊరు-మన బడి’తో సర్కారు బడుల్లో విద్యార్థులకు కార్పొరేట్ తరహాలో విద్య అందనుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంతోపాటు కొండా పూర్, అప్పయ్యపల్లె, గాంధీనగర్ గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమాల్లో పాల్గొని ‘మన ఊరు-మన బడి’ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మె ల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగా ణను సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అగ్రాగమిగా నిలుపుతున్నారని, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే ఆయన లక్ష్యమన్నారు. సబ్బండ వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి దేశంలోనే ఆదర్శ సీఎంగా నిలిచారన్నారు.
పేద విద్యార్థులకు కూడా కా ర్పొరేట్ స్థాయి విద్యను సర్కారు బడుల్లో అందించ డానికి ‘మన ఊరు-మన బడి’ అమలు చేస్తున్నారన్నారు. మొదటి విడుత గణపురం మండలంలోని పాఠశాల అభివృద్ధికి రూ. కోటీ 8లక్షల 19వేలు కేటాయిం చామని తెలిపారు. గణపురం మండల పరిషత్ పాఠశాల లో రూ. 42.19లక్షలు, కొండాపూర్లో ఉన్నత పాఠశా లకు రూ. 66 లక్షలతో చేపట్టనున్న పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ నిధుల తో పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తు న్నామని పేర్కొన్నారు. ప్రభు త్వ పాఠశాలల్లో శిక్ష ణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నా రని, ఇక్కడే నాణ్యమైన విద్య అందుతుందని, తల్లిదం డ్రులు తమ పిల్లలను ఇదే స్కూళ్లలో చేర్పించాలన్నా రు.
ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే బాధ్యత ప్రభు త్వానిదేనన్నారు. అదేవిధంగా పల్లె ప్రగతితో గ్రామాల్లో పట్టణ వాతావరణం నెలకొంటుందన్నారు. ఎక్కడ చూసినా పచ్చని చెట్లు, విశాలమైన అద్దాల్లాంటి రోడ్లు దర్శనమిస్తు న్నాయన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు పెట్టని పథకాలు అమలు చేసి ప్రజలకు బాసటగా నిలిస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో అరుంధతి, ఎంఈవో సురేందర్, పీఏసీఎస్ చైర్మన్ పూర్ణ చందర్రెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పోట్ల నగేశ్, సర్పంచ్ నారగాని దేవేందర్, మామి డి రవి, ఎంపీటీసీ మోట పోతుల శివశంకర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.