దేవరుప్పుల, జూన్2: పల్లెల ప్రగతే దేశాభివృ ద్ధికి సూచిక అన్న మహాత్మాగాంధీ మాటలను తెలంగాణ ప్రభుత్వం నాలుగు విడుతల్లో చేపట్టిన పల్లెప్రగతితో కడవెండి మెరిసిపోతున్నది. గ్రామా ల్లో పచ్చదనం, హరితహారం కింద ప్రకృతి వనా ల్లో పచ్చటి మొక్కలు, వైకుంఠధామాలు, తడిపొ డి చెత్తతో సేంద్రియ ఎరువుల తయారీకి షెడ్ల నిరా ్మణం వంటివి ఆచరణ రూపం దాల్చడంతో గ్రామ ముఖ చిత్రమే మారిపోయింది. సర్పంచ్తో పాటు గ్రామంలోని ప్రజల సహకారంతో పల్లె ప్రగతి పనులన్నీ సంపూర్ణంగా పూర్తయ్యాయి. వీధుల్లో శుభ్రత, పచ్చని చెట్లు, ఎప్పటికప్పుడు చెత్త సేకర ణ, తడిపొడి చెత్తను సెగ్రిగేషన్ షెడ్డుకు తరలించి సేంద్రియ ఎరువు తయారీలో కడవెండి గ్రామపం చాయతీ జిల్లాలోనే ముందు వరుసలో నిలుస్తోం ది. వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్డు, వన నర్సరీ, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్ పూర్తికాగా ప్రజలు ప్రత్యేక శ్రద్ధతో వాడుక లోకి వచ్చాయి.
గ్రామానికి నలువైపులా ప్రధాన రహదారులు బీటీ రోడ్లుకాగా, హరిత హారంలో వాటి వెంట నాటిన మొక్కలు పెరిగి చెట్లుగా మార డంతో సుందరం గా కనిపిస్తున్నాయి. గ్రామంలో ప్రతి వీధిలో ఇరు వైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి చూప రులను ఆకర్షిస్తున్నాయి. గ్రామంలోని ప్రతి వీధి లో సీసీ రోడ్డు ఉండగా శుభ్రత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరా ట చరిత్ర ఉన్న ఉద్యమాల గడ్డ కడవెండి. ఈ పోరాటంలో అసువులు బాసిన తొలి అమరుడు దొడ్డి కొంరయ్య స్తూపం గ్రామపంచాయతీ ముందు సాక్షాత్కరిస్తుంది. గ్రామం ముంగిటే య శ్వంతాపూర్ వాగు ఉండగా దానిపై రూ. 5 కోట్ల తో చెక్ డ్యాం పూర్తికాగా కడవెండిలో భూగర్బ జలాలు పెరుగడానికి కారణమైంది. వాగుపై ఉన్న హైలెవల్ వంతెన దాటితే కడవెండి వస్తుంది. గ్రా మంలో వీధుల వెంట పోతుంటే పల్లె ప్రగతి కని పిస్తుంది.