జనగామ చౌరస్తా : రన్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7న జరిగే 3కే రన్ విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి యువతకు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద రన్ ఇండియా ఫౌండేషన్ వాల్ పోస్టర్ను మున్సిపల్ చైర్మన్ పోకల జమున లింగయ్య, ఎంపీపీ మేకల కళింగరాజుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత శారీరక, మానసిక దృఢత్వం సాధించడం కోసం ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయమం చేయాలన్నారు.
అనంతరం జిల్లా కేంద్రంలోని గిర్నిగడ్డ ఏరియాకు చెందిన వంగ సరోజకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కల్యాణ లక్ష్మి చెక్కును అందజేశారు. కార్యక్రమంలో రన్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధులు చాడ పోచయ్య, డాక్టర్ సుల్తాన్ రాజా, కాసాని ఉపేందర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేశ్రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.