కుటుంబ సభ్యులకు ఎంపీ కవిత పరామర్శ
పబ్బం గడుపుకునేందుకే ప్రతిపక్షాల ధర్నా
రూ. లక్ష ఆర్థికసాయం అందించిన ఎమ్మెల్యే శంకర్నాయక్ సతీమణి
గూడూరు, ఏప్రిల్ 4 : సునీల్ కుంటుంబానికి అండగా ఉంటామని, నిరుద్యోగులు క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవద్దని ఎంపీ మాలోత్ కవిత సూచించారు. మండలంలోని సోమ్లాతండాకు చెందిన బోడ సునీల్ కుటుంబాన్ని ఆదివారం ఎంపీ కవిత ఎమ్మెల్యే శంకర్నాయక్ సతీమణి సీతామహాలక్ష్మితో కలిసి పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. యువత తెలంగాణ రాష్ర్టానికి వెన్నెముకలాంటిదని, రాష్ట్రంలో వారికి బంగారు భవిత ఉందన్నారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చొద్దని, క్షణికావేశానికి లోనై విలువైన ప్రాణాలు తీసుకోవద్దన్నారు. ప్రభుత్వం తరఫున సునీల్ కుటుంబాన్ని ఆదుకుంటామని, మంత్రి కేటీఆర్ను కలిసి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇప్పించేలా చూ స్తామని, డబుల్ బెడ్ రూం ఇల్లు ఇప్పిస్తామని తెలిపారు. ప్రతిపక్షాలు శవ రాజకీయాలు మా నుకోవాలన్నారు. సునీల్ దవాఖానలో చికిత్స పొందుతున్నప్పుడు కనీసం పరామర్శించే ప్రతిపక్ష నాయకుడు కరువయ్యాడని, పబ్బం గడుపుకునేందుకు ఇప్పుడు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారన్నారు. కాగా, సునీల్ కుంటుంబానికి ఎమ్మెల్యే శంకర్నాయక్ తరఫున ఆయన సతీమణి సీతామహాలక్ష్మి రూ. లక్ష ఆర్థికసాయం, రెండు క్వింటాళ్ల బియ్యాన్ని అందించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బీరవెళ్లి భరత్కుమార్రెడ్డి, ఆర్బీఎస్ జిల్లా కో ఆర్డినేటర్ బాలాజీ, మండలాధ్యక్షుడు వేం వెంకటకృష్ణారెడ్డి, నాయకులు నూకల సురేందర్, చీదురు వెంకన్న, సర్పంచ్లు, ఎంపిటీసీలు పాల్గొన్నారు.
ఇవి కూడా చూడండి..
తుపాకీతో బెదిరించారు.. బ్యాంకును దోచుకున్నారు
అసోంలో చివరి విడుత ఎన్నికల ప్రచారానికి తెర