జైపూర్: ముఖాలకు ముసుగులు ధరించిన వ్యక్తులు ఓ ప్రైవేట్ బ్యాంకులోకి చొరబడి దాదాపు రూ.40 లక్షలు దోచుకుని పరారయ్యారు. దొంగల చేతుల్లో తుపాకులు, ఇతర మారణాయుధాలు ఉన్నాయి. వారిని నిలువరించేందుకు సిబ్బంది ఒకరు సాహసించడంతో ఆయనపై దొంగలు దాడి చేసి గాయపర్చారు. ఈ సంఘటన రాజస్థాన్లోని చిత్తోర్గఢ్ జిల్లాలోని యాక్సిస్ బ్యాంకులో జరిగింది.
నింబహేర ప్రాంతంలో ఉన్న యాక్సిస్ బ్యాంకులో శనివారం ఐదుగురు ముసుగులు ధరించిన వ్యక్తులు ప్రవేశించారు. వారు సిబ్బందికి తుపాకీ ఎక్కుపెట్టి బ్యాంకులో ఉన్న దాదాపు రూ.40 లక్షల నగదును దోచుకుని పారిపోయారు. ఆ తర్వాత బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి వేలిముద్రలు ఇతర ఆధారాలను సేకరించారు. బ్యాంకులో ఉన్న సీసీటీవీ ఫుటేజీని స్వాధీనపర్చుకున్నారు.
‘దాదాపు రూ.40 లక్షలు దోచుకున్నారు. ఇంకా ఎక్కువే ఉండొచ్చు. బ్యాంక్ ధ్రువీకరణ పూర్తయిన తర్వాత దొంగతనానికి గురైన ఖచ్చితమైన మొత్తం తెలుస్తుంది. నిందితులను త్వరగా పట్టుకోవడానికి నాలుగు బృందాలను ఏర్పాటు చేసాం’ అని చిత్తోర్గఢ్ ఎస్పీ దీపక్ భార్గవ్ తెలిపారు.
దొంగలను ఆపడానికి ప్రయత్నించిన బ్యాంకు ఉద్యోగి ఒకరిపై దొంగలు దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డారని ఎస్పీ చెప్పారు. నిందితులను గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బెంగాల్లో ఎన్నార్సీ అమలుకు ప్రణాళికలు లేవు : విజయ్వర్గియా
హైదరాబాద్లో ఐపీఎల్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇస్తామన్న అజ్జూ భాయ్
అండం, శుక్ర కణం లేకుండానే పిల్లల్ని పుట్టించొచ్చు.. సరికొత్త పరిశోధన
ఫాల్కే అవార్డును దోస్త్ రాజ్ బహదూర్కు అంకితం చేస్తున్నా: రజినీకాంత్
రైతులకు మద్దతు తెలిపినందుకే కేంద్రం మమ్మల్ని శిక్షిస్తోంది: కేజ్రీవాల్
స్టాండప్ ఇండియా పథకానికి రూ.25,586 కోట్లు మంజూరు
ఇండోనేషియాలో భారీ వర్షాలు.. 23 మంది మృతి
లాంకో ప్రాజెక్టులో కూలిన బాయిలర్.. సురక్షితంగా బయటపడిన 16 మంది కార్మికులు
ఉత్తరాఖండ్లో దావానలం.. 1200 హెక్టార్ల అడవి బుగ్గి
బిల్గేట్స్.. మైక్రోసాఫ్ట్.. పరిచయం అక్కర్లేని పేర్లు.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..