జనగామ చౌరస్తా, జూన్ 2 : పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో అమరుల త్యాగాలను ప్రతిఒక్కరూ స్మరించుకోవాలని జనగామ డీసీపీ శ్రీనివాస్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వెస్ట్జోన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించార. ఈ సందర్భంగా డీసీపీ శ్రీనివాస్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరుల త్యాగాలను గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ఫ్రెండ్లీ పోలీసింగ్ అమల్లోకి వచ్చిందన్నారు. ప్రభుత్వ సహకారంతో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని నేరాలను కట్టడి చేస్తున్నదన్నారు. ఇదిలా ఉండగా ఏసీపీ కార్యాలయంలో జెండావిష్కరణ అనంతరం ఏసీపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుకావాలని కోరా రు. జనగామ పీఎస్లో పట్టణ సీఐ మల్లేశ్ యాదవ్ జాతీ య జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు కాసర్ల శ్రీనివాస్, సీహెచ్ రవి కుమార్, ప్రొబేషనరి ఎస్సైలు శ్రీనివాస్, సుమలత, ఏఎస్సైలు మనోహర్రావు, సయ్యద్ జకీర్ హుస్సేన్, సిబ్బంది కృష్ణ, సురేశ్, ప్రసాద్, నవీన్ పాల్గొన్నారు.
పారిశుధ్య కార్మికుల సేవలు మరువలేనివి
కరోనా నేపథ్యంలో పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలు మరువలేనివని మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున అన్నారు. జిల్లా కేంద్రంలోని జూబ్లీ హాలులో బుధవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మున్సిపల్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు పానుగంటి ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో నిర్వహించారు. జమున మాట్లాడుతూ కరోనా నియంత్రణలో అందరూ కలిసికట్టుగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తాళ్ల సురేశ్ రెడ్డి, కౌన్సిలర్లు పగిడిపాటి సుధాసుగుణాకర్రాజు, బొట్ల శ్రీనివాస్, బాల్దె కమలమ్మ, పేర్ని స్వరూప, మల్లిగారి చంద్రకళ, ముస్త్యాల చందర్, రామగళ్ల అరుణ, రాంచందర్, యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మునిగె కరుణాకర్, తిప్పారపు కళ్యాణ్, రాజు పాల్గొన్నారు.