స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 29 : వ్యాక్సినేషన్పై నిర్లక్ష్యం వద్దని తప్పని సరిగా గ్రామాల్లో వ్యాక్సినేషన్ వంద శాంతం పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ శివలింగయ్య ఆదేశించారు. శుక్రవారం మండలంలోని సముద్రాల, విశ్వనాథపురం, తానేధార్పల్లి గ్రామాల్లో కలెక్టర్ పర్యటించి, వ్యాక్సినేషన్ తీరును పరిశీలించారు. వ్యాక్సినేషన్పై అధికారులు నిర్లక్ష్యంగా ఉండడంతో ఎంపీడీవో కుమార స్వామిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పగూడం పీహెచ్సీ పరిధిలోని పది గ్రామాలకు ఎంపీడీవో కుమారస్వామి ప్రత్యేకాధికారి, కాగా, సముద్రాల గ్రామాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేయగా, గ్రామ ప్రత్యేకాధికారి ఐబీ ఏఈ యాసిర్, ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శి సంతోష్, మండల ప్రత్యేకాధికారి నర్సయ్య ఎవరు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నమైనా అధికారులు విధుల్లోకి రాకపోవడం ఏంటి, ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శి ఉండడం ఏంటి, నేను అధికారుల పనితీరును పర్యవేక్షణకు వచ్చాను గాని, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు ఎలా పనిచేస్తున్నారో చూడడానికి రాలేదని అసలు మీరు విధులు నిర్వహిస్తున్నారా? లేదా? అని ఎంపీడీవోను నిలదీశారు. అనంతరం విశ్వనాథపురం గ్రామంలో ఆకస్మిక తనిఖీకి వెళ్లగా పంచాయతీ కార్యదర్శి సరైన వివరాలు తెలుపకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తానేధార్పల్లిలో ఆకస్మిక తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. నవంబర్ 3 వరకు వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. గ్రామాల్లో 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ విశ్వప్రసాద్, జిలా వైద్యాధికారి మహేందర్, మండల ప్రత్యేకాధికారి నర్సయ్య ఉన్నారు.
వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి
జఫర్గఢ్ : మండలంలోని అన్ని గ్రామాల్లో నవంబర్ 3 నాటికి కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కలెక్టర శివలింగయ్య అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా మండలంలోని తీగారం, తిమ్మంపేటలో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ను ఆయన శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలం లోని అన్ని గ్రామాల్లో మల్టీ డిసిప్లినరీ టీం(ఎండీటీ)లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. గ్రామాల్లో కరోనా వ్యాక్సినేషన్ వేయించుకోని వారిని గుర్తించాలన్నారు. మండలంలోని తిమ్మంపేటలో వ్యాక్సినేషన్ను పూర్తి చేయడం పై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో రాంరెడ్డి, మండల ప్రత్యేకాధికారి రాజేంద్ర ప్రసాద్, ఎంపీడీవో శ్రీధర్స్వామి, తహసీల్దార్ స్వప్న, ఎంపీవో శ్రీనివాస్, మెడికల్ ఆఫీసర్ రాజు, ఆయా గ్రామాల సర్పంచ్లు మల్లేశం, జయపాల్రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, గ్రామాల నోడల్ అధికారులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
చిల్పూరు: మండల కేంద్రంలోని నష్కల్ గ్రామంలోని స్పెషల్ డ్రైవ్ను శుక్రవారం డీపీవో రంగాచారి సందర్శిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రా మంలోని ప్రజలు తప్పని సరిగా వ్యాక్సిన్కు సహక రించాలని తెలిపారు. సర్పంచ్ కర్నెకంటి స్వప్నవెంకటేశ్, ఎంపీటీసీ పాషం శిరిష, ఎంపీవో మహబుబ్ఆలీ, ఏఈవో స్వేత, ఏఎన్ఎంలు ఆంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
కొడకండ్ల: మండలంలోని గ్రామాలల్లో వందశాతం వ్యాక్సినేషన్ కోసం కృషి చేస్తున్నట్టు ఎంపీడీవో రమేశ్ తెలిపారు. శుక్రవారం మండలంలోని నర్సింగాపురం గ్రా మంలో ఇంటింటికి తిరుగుతు వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని స్పెషల్టీమ్ ద్వారా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి సందీప్, ఆరోగ్య సిబ్బంది, పాల్గొన్నారు.
లింగాలఘనపురం: మండలంలో శుక్రవారం కరోనా వ్యాక్సినేషన్ కొనసాగింది. మండల వ్యాప్తంగా దాదాపు 300 మందికి వ్యాక్సినేషన్ వేశారు. లింగాలఘనపురంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏఎన్ఎం స్వరూప, ఆశ కార్యకర్త పద్మ, పంచాయతీ కార్యదర్శి నాగేశ్వర్రావు, అంగన్వాడీ టీచర్ సావిత్రి పాల్గొన్నారు.