ప్రీమెట్రిక్ స్కాలర్షిప్తో పేదింటి బిడ్డలకు ఆర్థిక చేయూత
పేద ఎస్సీ స్టూడెంట్స్కు వరంగా మారిన పథకం
ప్రారంభమైన దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ
డిసెంబర్ 31తో ముగియనున్న గడువు
జిల్లాలో 2034 మందికి లబ్ధి
స్కీమ్పై అవగాహన కల్పిస్తున్న అధికారులు
భూపాలపల్లి రూరల్, నవంబర్ 24 ;సర్కారు బడిలో ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం పెట్టి నాణ్యమైన విద్యనం దించడంతో పాటు పేద ఎస్సీ విద్యార్థులకు ఏటా ఉపకార వేతనాలు(ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్) అందిస్తూ ప్రోత్సహిస్తున్నది. పిల్లల్ని చదివించేందుకు దళిత కుటుంబాల్లోని తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక చేయూతనివ్వడం వరంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో 5 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థుల(డే స్కాలర్)కు ఈ పథకం వర్తించనుండగా, డిసెంబర్ 31వరకు దరఖాస్తులు స్వీకరించనున్నది. జిల్లాలో 2వేల మంది అర్హులున్నా అవగాహన లేక గతేడాది 40మంది మాత్రమే దర ఖాస్తు చేసుకోగా, స్కీమ్ గురించి ఎక్కువ మందికి తెలిసేలా ఆ శాఖ విస్తృత ప్రచారం చేస్తున్నది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద ఎస్సీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకాన్ని అమలుచేస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో సకల సదుపాయాలు కల్పిస్తున్నా పిల్లల్ని చదివించేందుకు తల్లిదండ్రలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని సర్కారు గ్రహించి ఆర్థిక చేయూతనిచ్చేందుకు 5వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నది. అయితే అవగాహన లేకపోవడంతో దీన్ని ఎక్కువ మంది జిల్లాలో వినియోగించుకోవడం లేదు. ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్న నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులు కోరుతున్నారు.
జిల్లాలో వేలాది మందికి ప్రయోజనం
జిల్లాలోని 11 మండలాల్లో మొత్తం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 538 ఉన్నాయి. ఇందులో 468 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వీటిలో 5వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న ఎస్సీ విద్యార్థులు మొత్తం 2834 మంది ఉన్నారు. వీరిలో 800మంది వసతి గృహాల్లో ఉంటున్నారు. మిగతా 2034మంది విద్యార్థులు ప్రీ మెట్రిక్ ఉపకార వేతన పథకానికి దరఖాస్తు చేసుకొని లబ్ధిపొందవచ్చు. గత సంవత్సరం కరోనా కారణంగా అవగాహన లోపంతో కేవలం జిల్లాలో 40మంది విద్యార్థులు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకొని లబ్ధిపొందడం జరిగింది. ప్రస్తుత సంవత్సరంలో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఈ పథకంపై అవగాహన కల్పించి ఎక్కువ మంది లబ్ధిచేకూరేలా ల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
దరఖాస్తు గడువు డిసెంబర్ 31
ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసేందుకు వచ్చే నెలాఖరు వరకు గడువు ఉంది. ఆ తర్వాత అర్హులైన విద్యార్థులకు ప్రభుత్వం ఉపకార వేతనాలు అందజేస్తుంది. 5 నుంచి 8వ తరగతి బాలికలకు రూ.1500, బాలురకు రూ.1000 ఇస్తారు. 9, 10 తరగతుల విద్యార్థులకు రూ.3000 చొప్పున ఏడాదికి అందుతుంది. ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్స్ కాపీ జతచేసి సమీప మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతానికి చెందిన వారైతే రూ.1.50 లక్షలు, పట్టణవాసులైతే రూ.2 లక్షల లోపు వార్షికాదాయం ఉంటేనే ఉపకార వేతనం పొందేందుకు అర్హులు.
జీరో అకౌంట్ ఇవ్వాలని చెప్పాం..
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 5 నుంచి 10వ తరగతి వరకు చదువుకుంటున్న ఎస్సీ విద్యార్థులు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్కు అర్హులు. డిసెంబర్ 31వ తేదీ లోపు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకంపై జిల్లాలోని విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. జీరో అకౌంట్ విషయమై బ్యాంకు అధికారులకు స్పష్టంగా చెప్పాం. ఈ పథకంతో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది.