పోస్టల్ శాఖ తెలంగాణ సర్కిల్ రీజినల్ ఆఫీసర్ పీవీఎస్ రెడ్డి
తపాల శాఖచే పాలకుర్తిలో పోస్టల్ కవర్ ఆవిష్కరణ
పాలకుర్తి, అక్టోబర్ 13 :తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోదురాలు చిట్యాల ఐలమ్మకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సముచిత గుర్తింపు ఇచ్చాయని పోస్టల్ శాఖ తెలంగాణ సర్కిల్ హైదరాబాద్ రీజినల్ ఆఫీసర్ పీవీఎస్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని సోమేశ్వర ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉద్యమంలో పాల్గొని వెలుగులోకి రాని వీరులను ప్రత్యేకంగా గుర్తించేందుకు భారత ప్రభుత్వం వారిని నిర్ణయం తీసుకుందన్నారు. నాటి పోరాటంలో చిట్యాల ఐలమ్మ, రావి నారాయణరెడ్డి, ముగ్గం కొంరంభీం వంటి వీరు పేరున పోస్టల్ స్టాంపులు, కవర్లను విడుదల చేసినట్లు ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో ఐలమ్మ మెట్టినింటనే కవర్ను విడుదల చేశామన్నారు. ఎవరికైనా ఆస్తి, ఐశ్వర్యంతో గుర్తింపు రాదని పేదల కోసం చేసిన పోరాటాలు, సామాజిక ఉద్యమాలతోనే గుర్తింపు లభిస్తుందన్నారు. ఈ నేపథ్యంలోనే ఐలమ్మ ప్రజల హృదయాల్లో చిరకాలం గుర్తిండిపోతుందన్నారు. తపాల శాఖలో అనేక పథకాలున్నాయని, వాటిని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలి
వీరనారి చిట్యాల ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలని టీఆర్ఎస్ జడ్పీ ఫ్లోర్ లీడర్ పుస్కూరి శ్రీనివాస్రావు అన్నారు. నాడు పెత్తందార్లకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపర్చిన ఐలమ్మ నేటి యువతరానికి స్ఫూర్తి అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు వీరమనేని యాకాంతారావు, ఎంపీటీసీ కమ్మగాని పుష్పలీల, చిట్యాల ఐలమ్మ వారసులు మాజీ సర్పంచ్ చిట్యాల రామచంద్రం, చిట్యాల యాక య్య, జంపయ్య, సువర,్ణ రాజు పాల్గొన్నారు..