జిల్లాలో వరికి బదులు వాణిజ్య పంటల సాగు
యాసంగికి వ్యవసాయ శాఖ ప్రణాళిక
వేరుశనగ, శనగ, పెసర, నువ్వు సాగుపై రైతుల దృష్టి
గ్రామాల్లో వ్యవసాయ శాఖ అవగాహన సదస్సులు
ఆయిల్పామ్ సాగుకు ప్రోత్సాహం
జనగామ రూరల్, డిసెంబర్ 8 : వ్యవసాయ శాఖ సూచనల ప్రకారం రైతులు వాణిజ్య పంటలపై దృష్టి సారించారు. ధాన్యాన్ని కొనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేయడంతో వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. యాసంగి సీజన్లో జిల్లాలో 41,360 ఎకరాల్లో పప్పుదినుసులు, ఇతర పంటలు పండించేలా ప్రణాళిక రూపొందించింది. దీని ప్రకారం.. వేరుశనగ 14,056 ఎకరాలు, జొన్నలు 215, పెసర 2,803, మినుములు 1910, శనగలు 3.362, నువ్వులు 1,473, బొబ్బర్లు 295, కందులు 240, ఉలవలు 435, పొగాకు 531, ఎర్రమిర్చి 902, కూరగాయలు 3.185, ఇతర పంటలు 12,981 ఎకరాల్లో సాగు చేసేలా కార్యాచరణ చేపట్టారు. విత్తనాలకు సబ్సిడీతో పాటు మరికొన్ని రాయితీలను వ్యవసాయ శాఖ అందిస్తున్నది. ప్రస్తుతం జిల్లాలో ఆయిల్పామ్ 150 ఎకరాల్లో వేయగా, ఈసారి వెయ్యి ఎకరాలకు పెంచే లక్ష్యంతో ముందుకుసాగుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం దొడ్డురకం వడ్లను కొనలేమని చేతులెత్తేసిన నేపథ్యంలో వ్యవసాయ శాఖ సూచనలకనుగుణంగా ఆరుతడి పంటలపై రైతులు దృష్టి సారించారు. యాసంగి సీజన్లో వరికి బదులు పప్పుధాన్యాలు, కూరగాయల, నూనెగింజల సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో రైతులకు పంటలపై ఆవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. వానకాలంలో ఏఏ పంటలు సాగు చేశారు.. యాసంగి సీజన్లో ఏఏ పంటలు వేస్తారు అనే విషయమై ప్రణాళిక రూపొందించారు. ఇందుకనుగుణంగా గ్రామాలు, మండలాల వారీగా సాగు చేసేందుకు కార్యాచరణ చేపడుతున్నారు. భారత ఆహార సంస్థ(ఎఫ్సీఐ) దొడ్డురకం బియ్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి లేక పోవడంతో వాటికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సూచనలు చేసింది. దీంతో రైతులు వాణిజ్య పంటలను సాగు చేసేందుకు ఉద్యుక్తులవుతున్నారు.
ఆరుతడి పంటలపై ప్రణాళిక
యాసంగి సీజన్లో జిల్లా వ్యాప్తంగా 41,360 ఎకరాల్లో ఆరుతడి పంటలు వేసేందుకు వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. జొన్నలు 215 ఎకరాలు, వేరుశనగ 14,056 ఎకరాలు, పెసర 2,803 ఎకరాలు, మినుములు 1910, శనగలు 3.362 ఎకరాలు, నువ్వులు 1,473 ఎకరాలు, బొబ్బర్లు 295 ఎకరాలు, కందులు 240 ఎకరాలు, ఉలవలు 435 ఎకరాలు, పొగాకు 531 ఎకరాలు, ఎర్రమిర్చి 902 ఎకరాలు, కూరగాయలు 3.185 ఎకరాలు, ఇతర పంటలు 12,981 ఎకరాలు సాగు చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇంటి అవసరాలతోపాటు వ్యాపారులు కొనుగోలు చేసే అవకాశాన్ని బట్టి వరి సాగు చేయాలని రైతులు భావిస్తున్నారు. మరోవైపు ఈ సా రి అయిల్పామ్ను జిల్లాలో వెయ్యి ఎకరాల్లో సాగుకు ప్రభు త్వం నుంచి అనుమతి వచ్చిందని ఉద్యానవన శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో ఇప్పటికే 150 ఎకరాల్లో దీనిని సాగు చేస్తున్నారు. ఆయిల్పామ్కు ప్రభుత్వం నుంచి రాయితీలతోపాటు ప్రోత్సా హం ఉండడంతో పలు గ్రామాల రైతులు నూనెగింజల పంటలపై ఆసక్తి చూపుతున్నారు.
లాభాలొచ్చే పంటలపై ఆసక్తి
అధిక దిగుబడులొచ్చే పంటలను సాగు చేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు రైతులను ప్రోత్సహిస్తున్నారు. ప్రతి క్లస్టర్ పరిధిలోని గ్రామం, అక్కడి సాగు భూముల్లో పంటలపై రైతులతో ఎక్కడికక్కడ సమావేశమై చర్చిస్తున్నారు. దొడ్డురకం వరి సాగు చేస్తే వచ్చే మార్కెటింగ్ కష్టాలను వివరించి వాణిజ్య పంటలు వేసేలా అవగాహన కల్పిస్తున్నారు. రైతుబంధు సమితి సభ్యులతో సమన్వయం చేస్తూ లాభనష్టాలపై వివరిస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉండే వాటిని పండిం చాలని రైతులను కోరుతున్నాం.
యాసంగి సీజన్పై రైతులకు అవగాహన
దొడ్డురకం ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే పరిస్థితి లేదు. అందుకే యాసం గి సీజన్లో వాణిజ్య పంటలపై దృష్టి సారించాలని రైతులకు ఆవగాహన కల్పిస్తున్నాం. రైతు వేదికల్లో సమావేశాలు నిర్వహిస్తూ పంటల సాగును వివరిస్తున్నారు. రైతుబంధు సమితి ప్రతినిధులతో కలిసి ఉద్యానవన, వ్యవసాయ అధికారులు వివరిస్తున్నారు. మారుతున్న కాలానికనుగుణంగా ఏఏ పంటలు సాగు చేస్తే లాభాలొస్తాయో తెలియజేస్తున్నాం. రైతుల ఆసక్తికనుగుణంగా పంటలకు అవసరమైన విత్తనాలు సమకూరుస్తున్నాం.
-తక్కోలు రాధిక, జిల్లా వ్యవసాయ అధికారి, జనగామ