జనగామ చౌరస్తా, అక్టోబర్ 7 : జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, వైద్యాధికారులు, ఎంపీవోలు, మల్టీపర్పస్ సూపర్వైజర్లతో కలెక్టర్ వ్యాక్సినేషన్, టీబీ వ్యాధిగ్రస్తుల గుర్తింపు, ఏఎన్సీ పరీక్షలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా కలెక్టర్ శివలింగయ్య మాట్లాడుతూ జిల్లాలో సర్వే ద్వారా 3 లక్షల 66 వేల 453 మంది 18 సంవత్సరాల వయసు నిండిన వారిని గుర్తించినట్లు తెలిపారు. వీరిలో ఇప్పటి వరకు 3 లక్షల 10 వేల 267 మందికి (84.67శాతం) వ్యాక్సినేషన్ చేసినట్లు తెలిపారు. మిగ తా 56 వేల 186 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో జనన, మరణాల సగటు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ అంచనాల ప్రకా రం సుమారు 4 లక్షల 10 వేల వరకు 18 ఏళ్లు వయసు నిండిన వారు ఉండాలన్నారు. ఈ వ్యత్యాసం ఎందుకు వస్తుందో క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. జిల్లాలో 50 మంది మల్టీపర్పస్ హెల్త్ సూపర్వైజర్లు ఉన్నట్లు, వీరు వారి పరిధిలో సర్వేలో ప్రతి ఇంటిని కవర్ చేశారా, ఇంకా ఏమైనా ఇండ్లు మిగిలాయా, ప్రతి ఇంటికీ వ్యాక్సినేషన్కు సంబంధించి స్టిక్కర్ అంటించారా, వ్యాక్సిన్ వేసుకోవాల్సిన వారి వివరాలు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాన్నారు.
జిల్లాలో ఏప్రిల్ 2021 నుంచి ఇప్పటి వరకు 489 మంది టీబీ రోగులను గుర్తించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. టీబీ వ్యాధిగ్రస్తుల సంబంధికులను స్క్రీనింగ్ చేయాలని, అలాగే జిల్లాలో రోగ నిరోధకత శక్తి తక్కువగా ఉన్న 1 వెయ్యి 578 మంది హెచ్ఐవీ రోగులు ఉన్నట్లు, వారిని కూడా స్క్రీనింగ్ చేయాలని, ఒకవేళ వారిలో టీబీ గుర్తిస్తే, వారి సంబంధికులను స్క్రీనింగ్ చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఏఎన్సీ రిజిస్ట్రేషన్లు 84 రోజులలోపు చేయాల్సిఉండగా, చాలా చోట్ల వంద శాతం జరగట్లేదని, ఇందుకు ప్రణాళిక చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. మొదటి, రెండో పరీక్షలు ప్రాథమిక ఆరోగ్య, మూడో, నాలుగో పరీక్షలు ఎంసీహెచ్లో నిర్వహించాల న్నారు. పరీక్షలు జరిగి రిజిస్ట్రేషన్ అయితేనే కేసీఆర్ కిట్ కు అర్హత పొందుతారని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఏ మహేందర్, డీపీవో కే రంగాచారి, డీఆర్డీవో రాంరెడ్డి, జెడ్పీ సీఈవో ఎల్ విజయలక్ష్మి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ రాము, జిల్లా ఉప వైద్య, ఆరోగ్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.