గీసుగొండ, డిసెంబర్ 6 : రైతులు యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయాలని కలెక్టర్ గోపి అన్నారు. మండలంలోని ఊకల్ గ్రామంలో నిర్వహించిన వగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. అనంతరం వంచనగిరిలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయనందున రైతులు ఆరుతడి పంటలు సాగు చేసేలా అధికారులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఉషాదయాళ్, ఏవో హరిప్రసాద్బాబు, తహసీల్దార్ సుహాసిని, ఎంపీడీవో రమేశ్, సర్పంచు నాగదేవత, ఎంపీటీసీ వీరారావు, ఏఈవోలు బిందు, విజయ్నాయక్ పాల్గొన్నారు.
నర్సంపేట రూరల్: మండలంలోని అన్ని గ్రామాల రైతులు యాసంగిలో ఆరుతడి పంట ల సాగుపై దృష్టి సారించాలని ఏఈవో మెండు అశోక్ అన్నారు. మండలంలోని మహేశ్వరం గ్రామంలో సోమవారం ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. యాసంగిలో వరి బదులు నూనె గింజలు, పప్పు దినుసుల పంటలను సాగు చేయాలన్నా రు. కార్యక్రమంలో సర్పంచ్ మాడ్గుల కవిత, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
దుగ్గొండి: యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని ఏవో చిలువేరు దయాకర్ అన్నారు. మండలంలోని మందపల్లి, మైసంపల్లి, లక్ష్మీపురం, బొబ్బరోనిపల్లి గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్లు మొగ్గం మ హేందర్, పాండవుల సురేశ్, శంకేసి శోభాకమలాకర్తో పాటు ఏఈవోలు రాజేశ్, మధు, హన్మం తు, విశ్వశాంతి పాల్గొన్నారు.
చెన్నారావుపేట: రైతులు వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని ఏవో కర్పూరపు అనిల్కుమార్ అన్నారు. పలు గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఏఈవోలు స్మిత, వినయ్, సంపత్, రఘుపతి, సర్పంచ్లు పిండి విజయ, బోడ ఆనంద్, వెల్దె సుజాత, ధరంసోతు కిషన్, రైతులు పాల్గొన్నారు.