జనగామ, నవంబర్ 29(నమస్తే తెలంగాణ) : పట్ట ణంలో కోతులు, పందులు, కుక్కల బెడద తీవ్ర స్థాయి లో ఉందని, వీటి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడు తున్న దృష్ట్యా వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని అన్ని పార్టీల సభ్యులు ముక్తకంఠంతో నినదించారు. అంతేకాకుండా అభివృద్ధి పనులు సహా వార్డుల్లో నెల కొన్న సమస్యల పరిష్కారం వంటి అంశాలతోపాటు నిధులున్నా అధికారుల నిర్లక్ష్యంతో వార్డుల్లో నత్తనడ కన సాగుతున్న పనులపై కౌన్సిల్లో ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం చైర్పర్సన్ పోకల జమున అధ్య క్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్(ఐఏఎస్), మున్సిపల్ వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్, కమిషనర్ రజిత, డీఈ చంద్రమౌళి హాజరయ్యారు. ఎజెండాలో పొందుపరిచిన అంశాలపై సభ్యులు చర్చించగా బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు కొన్నింటిపై అభ్యంతరం తెలిపారు. తమ వార్డుల్లో నిధులున్నా పనులు కావడంలేదని, పారిశుధ్య పనులు జరగడంలేదని టీఆర్ఎస్ సభ్యులు అధికారులను నిలదీశారు.
కార్మికుల కొరతతో పారిశు ధ్య పనులకు ఇబ్బందులు ఎదురవుతుంటే ఇతర పను లు చేయించుకునేందుకు అనుమతి ఇవ్వడంపై పలువు రు అభ్యంతరం వ్యక్తం చేశారు. జనగామ మున్సిపా లిటీ అభివృద్ధి కోసం నిధులు సమకూర్చుకోవాలని బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్ మహంకాళి హరిశ్చంద్ర గుప్త పేర్కొన్నారు. కరోనాతో రెండేళ్లు నష్టపోయిన వ్యా పారస్తులకు ట్రేడ్ లైసెన్స్ అంశంలో వెసులుబాటు క ల్పించాలని ఆయన కోరారు. విద్యుత్ స్తంబాలు మం జూరు చేయడం లేదని కౌన్సిలర్ మల్లేశ్ ఆందోళన వ్యక్తం చేయగా, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డు ల్లో ఇతర కౌన్సిలర్ల జోక్యాన్ని జక్కుల అనిత తప్పుబ ట్టారు. రైల్వేస్టేషన్ నుంచి బస్టాండ్ వరకు రోడ్డుకు ఇరువైపులా జరిగిన ఆక్రమణలతో ట్రాఫిక్ ఇబ్బందు లు తలెత్తుతున్న దృష్ట్యా వెంటనే తొలగింపు చర్యలు చేపట్టాలని టీఆర్ఎస్ సభ్యులు మారబోయిన పాండు, బండ పద్మ కోరారు. వంగాల కల్యాణి, కమలమ్మ, పాకా రమ, ఉడుగుల శ్రీలత మాట్లాడుతూ వార్డులో బ్లీచింగ్ పౌడర్ ఫాగింగ్ స్ప్రే చేయడం లేదని, దీనివల్ల దోమల బాధ ఎకువ అవుతుందని అన్నారు. ఎండీ సమద్ మాట్లాడుతూ అమ్మబావి వైన్స్ వద్ద రోడ్డు మీద వచ్చి తాగుతున్నారని, ఈ విషయం గతంలో చెప్పినా ఇంతవరకు చర్య తీసుకోలే దన్నారు. దీని వల్ల వార్డులో మహి ళలు, చిన్న పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుందని అన్నారు. కౌన్సిల్ సమావేశంలో మొ త్తం 18 ఎజెండా అంశాలు, మూడు టేబుల్ అంశా లకు సభ్యులు ఆమోదం తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా పనిచేసే కార్మికులకు సన్మానం చేయడం సహా స్వచ్ఛ సర్వేక్షణ్ బ్రాండ్ అంబాసిడర్గా నియమి తులైన చార్లబుడ్ల మాలతిని సభ్యులు సత్కరించారు. కౌన్సిలర్లు బొట్ల శ్రీనివాస్, చందర్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారంపై దృష్టి పెడుతా..
– అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్..
కౌన్సిల్లో సభ్యులు ప్రస్తావించిన అంశాలు, వార్డు సమస్యలన్నీ నోట్ చేసుకున్నాం. వాటి పరిషారంపై ప్రత్యేక దృష్టి సారిస్తా. వార్డుల అభివృద్ధికి సభ్యులు తమ వంతు కృషి చేయాలి. కౌన్సిలర్లు అందరూ సమావేశా నికి హాజరై చివరి వరకు ఉండాలి. మెజార్టీ సభ్యులు హాజరైనా సమావేశం పూర్తయ్యే వరకు ఉంటే వివిధ అంశాలపై అర్థ్ధవంతమైన చర్చ సాగి సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది.
కలిసి పనిచేద్దాం: చైర్పర్సన్ పోకల జమున
జనగామ పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందు నిలిపేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా సమన్వయంతో ముందుకు సాగాలి. పట్టణ అభివృద్ధిలో అందరు భాగస్వామ్యం కావాలి. అండర్ డ్రైనేజీ, పట్టణ సుందరీకరణ ప్రతిపాదలపై నిధులు సాధించి జనగామను మోడల్ పట్టణంగా తీర్చిదిద్దుదాం. జిల్లాగా ఆవిర్భవించిన జనగామ పట్టణం దశ మారుతున్నదని, స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్రత్యేక శ్రద్ధతో సీఎం కేసీఆర్ను ఒప్పించి కొత్త జిల్లా కేంద్రం అభివృద్ధికి బాటలు వేస్తున్నారు.