కరీమాబాద్, మే 13 : ముఖ్యమంత్రి కేసీఆర్ గుడిసెవాసుల కల నెరవేర్చారని వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. జీవో 58, 59 ద్వారా మంజూరైన పట్టాలను శనివారం లెనిన్నగర్లోని గుడిసెవాసులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏండ్ల తరబడి గుడిసెల్లో ఉన్న పేదలకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చి హక్కుదారులను చేసిందన్నారు. గత ప్రభుత్వాలు చేయని పనిని తెలంగాణ ప్రభుత్వం చేసిందని చెప్పారు. అలాగే, గుడిసెల కాలనీల్లో మౌలిక వసతులను కల్పించిందన్నారు.
ఇంటి నంబర్లు కేటాయించిందని, పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. జీవోలు 58, 59పై అవగాహన కల్పించి కాలనీల్లోనే మీ సేవ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. గుడిసెవాసులు ముఖ్యమంత్రి కేసీఆర్కు అండా నిలవాలన్నారు. అనంతరం ఎమ్మెల్యేను గుడిసెవాసులు సత్కరించారు. కార్యక్రమంలో ఖిలావరంగల్ తహసీలార్ ఫణికుమార్, ఖిలా వరంగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కేడల జనార్దన్, కార్పొరేటర్లు సోమిశెట్టి ప్రవీణ్, వేల్పుగొండ సువర్ణ, డివిజన్ అధ్యక్షుడు కర్ర కుమార్ పాల్గొన్నారు.