హనుమకొండ, డిసెంబర్ 3: న్యాయ విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నం ఘటనపై మూడు రోజులుగా వివిధ మాధ్యమాల్లో వార్తలు వస్తుండడంపై అధికార యంత్రాంగం స్పందించింది. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రత్యేకంగా అధికార బృందాన్ని పంపారు. శనివారం జిల్లా రెవెన్యూ అధికారి ఎం వాసుచంద్ర, హనుమకొండ తహసీల్దార్ రాజ్కుమార్, జిల్లా సంక్షేమ అధికారి సబిత, సఖి వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ హైమావతి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కే అనితారెడ్డి బృందంతో కలిసి బాలసముద్రంలోని శివశంకర్ లేడీస్ హాస్టల్తోపాటు చుట్టుపకల వారిని విచారించారు.
శివశంకర్ లేడీస్ హాస్టల్ నాలుగేళ్లుగా చాలామంది ఇన్మేట్స్తో నిర్వహిస్తున్నట్లు బృందం గుర్తించింది. బాధిత మహిళ ప్రస్తుతం స్వగ్రామంలో తన తల్లిదండ్రుల వద్ద క్షేమంగా ఉన్నట్లు అధికార బృందం ఫోన్ ద్వారా అడిగి తెలుసుకుంది. లేడీస్ హాస్టల్ లైసెన్స్ రద్దు చేయాలని, సత్వర చర్యలు తీసుకోవాలని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ను కలెక్టర్ ఆదేశించారు. ఈ పరిశీలన బృందంలో సఖి వన్ స్టాప్ సెంటర్ లీగల్ కౌన్సిలర్ శ్రీదేవి, ఐసీడీఎస్ సూపర్వైజర్ వంచ రాజ్యలక్ష్మి ఉన్నారు.