పాలకుర్తి, జూన్ 1: రెండు రోజులుగా పాలకుర్తిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ తల్లి విగ్రహ గద్దె నిర్మాణ వివా దం రాజుకుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఆధిపత్య పోరు సాగింది. కాంగ్రెస్ నాయకులు పోలీసుల అండతో గూండాయిజం చేస్తూ రాత్రికి రాత్రే గద్దె నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రతిగా ఆదివారం బీఆర్ఎస్ శ్రేణులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సతీమణి ఉషా దయాకర్రావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ర్యాలీగా పోలీస్స్టేషన్కు వస్తుండగా వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య ఆధ్వర్యంలో రాజీవ్ చౌరస్తాలో అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వా దం చోటుచేసుకుంది. తోపులాట జరిగింది.
ఈ క్రమంలో ఉషా దయాకర్రావు కొంత అస్వస్థతకు గురైంది. అయినా పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆవేశంతో రగిలిపోయారు. పో లీసు జులుం నశించాలి…పోలీసులు డౌన్డౌన్.. కాంగ్రె స్ గూండాయిజం నశించాలి అంటూ నినాదాలు చేశారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని మండిపడ్డాయి. పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని ఉషా దయాకర్రావు నిలదీయడంతో చివరకు పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులను విడిచి పెట్టడం తో స్టేషన్కు చేరుకున్నారు. పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఉషా దయాకర్రావు, బీఆర్ఎస్ ము ఖ్య నాయకులు హనుమాండ్ల ఝాన్సీరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయాలని ఎర్రబెల్లి ఉషా దయాకర్రావు అన్నారు. పోలీస్స్టేషన్లో ఝాన్సీరెడ్డిపై ఫిర్యాదు చేసిన ఆనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విదేశీయురాలైన ఝాన్సీరెడ్డికి భారత పౌరసత్వం ఉందా అని ప్రశ్నించారు. ఓటు హక్కులేని ఝాన్సీరెడ్డికి కుర్చీలు వేసి మర్యాదలు చేసిన పోలీసులు 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు భార్యనైన తనకు మర్యాద ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. పోలీసులు మహిళను అని చూడకుండా అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా అని మండిపడ్డారు. పాలకుర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఝాన్సీరెడ్డినా, ఆమె కోడలు యశస్వినీరెడ్డినా ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఝాన్సీరెడ్డి పోలీస్స్టేషన్కు వచ్చి బీఆర్ఎస్ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టించడం ఎంత వరకు సమంజసమన్నారు.
పోలీసులు కాంగ్రెస్ తొత్తులుగా పనిచేస్తున్నారని విమర్శించారు. పాలకుర్తిలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. 15 ఏళ్లుగా పాలకుర్తి నియోజకవర్గానికి ఎర్రబెల్లి దయాకర్రావు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాడని చెప్పారు. ఏనాడూ ఘర్షణ రాజకీయాలు చేయలేదన్నారు. ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి అభివృద్ధిలో పోటీ పడాలని సవాల్ విసిరారు. 17నెలల కాంగ్రెస్ పాలనలో పాలకుర్తి నియోజక వర్గంలో అభివృద్ధి శూన్యమన్నారు. అధికారం చేతిలో ఉందని బీఆర్ఎస్ శ్రేణులను బెదిరింపులకు గురి చేస్తూ ఝాన్సీరెడ్డి, ఆమె కోడలు యశస్వినీరెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. ఝాన్సీరెడ్డి పోలీస్ అధికారులను దుర్భాలాషలాడుతూ ఎస్సైని తిట్టడం అన్యాయమన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జోగు గోపీపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడం అమానుషమన్నారు. కాంగ్రెస్ గుండాల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న గోపీని ఉషా దయాకర్రావు పరామర్శించారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని, తాము త్వరలోనే అధికారంలోకి వస్తామన్నారు.
వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. పోలీసు అధికారుల్లారా ఖబర్దార్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఆధైర్య పడొద్దని, అండగా ఉంటామన్నారు. బీఆర్ఎస్ శ్రేణులను ముందస్తు అరెస్టులు చేయడం అక్రమమన్నారు. ఆమె వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పసునూరి నవీన్, తీగల దయాకర్, మూనవత్ నర్సింహానాయక్, ఈదూరు ఐలయ్య, వసుమర్తి సీతారాములు, మాజీ జడ్పీటీసీలు మంగళంపల్లి శ్రీనివాస్, పుస్కూరి శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీలు జినుగు అనిమిరెడ్డి, బస్వ మల్లేశం, ఎఫ్ఎస్సీఎస్ బ్యాంక్ చైర్మన్ బొబ్బల ఆశోక్రెడ్డి, జరుపుల బాలునాయక్, చింతరవి, చెంచు రాజిరెడ్డి, బానోతు మహేందర్, లకావత్ వెంకట్నాయక్, సురేశ్నాయక్, ఆస్రాఫ్ పాషా, కటారి పాపారావు, కారుపోతుల వేణు,గుగ్గిళ్ల యాకయ్య, పొన్నం యాకయ్య, ఎండీ నాసర్, కారుపోతుల వెంకటయ్య, ధరావత్ యాకూబ్నాయక్, ఇమ్మడి ప్రకాశ్, ఎస్కే అంకూస్, కాలునాయక్, జంపాల రాజు, జిట్టబోయిన కొంరెల్లి, కోల నారాయణ, ఉప్పల సాయి, మామిండ్ల శోభన్బాబు, మల్యాల పర్శరాములు, చింతకింది ఉపేందర్, నల్లపు ఆశోక్, కత్తి సైదులు, ఆవుల రవి, రాంరెడ్డి, బీరెల్లి రవివర్మ తదితరులు పాల్గొన్నారు.