వర్ధన్నపేట, డిసెంబర్ 5 : విద్యా, వైజ్ఞానిక రంగాల్లో తెలంగాణను దేశంలోనే నంబర్ వన్గా నిలుపాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి యాకర్రావు అన్నా రు. వర్ధన్నపేట ఆల్ఫోర్స్ పాఠశాలలో జరుగుతు న్న జిల్లా స్థాయి సైన్స్, వైజ్ఞానిక ప్రదర్శన ముగిం పు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్ల ను పరిశీలించారు. అనంతరం డీఈవో వాసంతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థిలో ఏదో ఒక ప్రతిభ ఉం టుందని, ఉపాధ్యాయులు దీన్ని గుర్తించి ప్రోత్సహించాలన్నారు.
దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే విద్యార్థులు సైన్స్, వైజ్ఞానిక రం గంలో రాణించాలన్నారు. ఇందుకోసమే సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వసతులు కల్పిస్తున్నారని చెప్పారు. పెద్ద సంఖ్యలో గురుకులాలను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తున్నారన్నారు. ఈ ఏడాది ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు రూ.5వేల కోట్ల మేర ఖర్చు చేసిందని తెలిపారు. అలాగే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థును సైన్స్, వైజ్ఞానిక విభాగంలో ప్రోత్సహించాలని, తన వంతు సహకారం అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
విజేతలకు సర్టిఫికెట్ల ప్రదానం..
జిల్లా స్థాయి సైన్స్ఫేర్లో ఉత్తమ ప్రతిభ చూపి న విద్యార్థులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు డీఈవో వాసంతి తెలిపారు. ఏడు విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో జూనియర్స్, సీనియర్స్ విభాగాల నుంచి ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు న్యాయనిర్ణేతలు ఎంపిక చేశారు. అనంతరం వారికి బహుమతులతో పాటు సర్టిఫికెట్లను అందించారు. గైడ్లుగా పనిచేసిన ఉపాధ్యాయులకు కూడా సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. విద్యార్థులు, అతిథులకు ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేసిన కమిటీల ప్రతినిధులు, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముగింపు సమావేశంలో జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, ఆల్ఫోర్స్ స్కూళ్ల చైర్మన్ నరేందర్రెడ్డి, డీసీఈబీ కార్యదర్శి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
భక్తులకు మెరుగైన సౌకర్యాలు..
పర్వతగిరి : మండల కేంద్రంలోని పర్వతాల శివాలయంలో ధ్వజ స్తంభం ప్రతిష్ఠాపన మహోత్సవంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ ధర్మకర్త రామ్మోహన్రావుతో కలిసి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాదాపు 850 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ శివాలయం కోసం ఇప్పటికే రూ.5 కోట్లకు పైగా ఖర్చు చేసి గుట్ట మీద ఆలయం నిర్మించినట్లు తెలిపారు. దేవాదాయ శాఖ నుంచి మంజూరైన రూ.70 లక్షలతో భక్తులకు వసతి సదుపాయం ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ధర్మకర్త మంత్రికి వివరించారు. విద్యుత్, మంచి నీటి వసతి, రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. 2023 జనవరి 26వ తేదీన శివాలయాన్ని పునఃప్రారంభించనున్నట్లు తెలిపారు. సర్పంచ్ చింతపట్ల మాలతి, ఉపసర్పంచ్ రంగు జనార్దన్ గౌడ్, ఎంపీటీసీ రాజు, బొట్ల మహేంద్ర, మండలాధ్యక్షుడు రంగు కుమార్గౌడ్, భాస్కర్, దేవాకుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
మహా పడిపూజలో పాల్గొన్న మంత్రి..
రాయపర్తి : పట్టుదలతో చేసే కార్యాలకు తప్పకుండా ఫలితాలు దక్కుతాయని చెప్పడానికి తె లంగాణ ప్రత్యేక రాష్ట్రమే నిలువెత్తు ఉదాహరణ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. మండలంలోని కిష్టాపురం క్రాస్ రోడ్డులోని మ యూరి గార్డెన్స్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మచ్చ సోమయ్య-ఉమారాణి దంపతులు గురుస్వాములు వెంకటేశ్వరశర్మ, శివశర్మ సారధ్యంలో అప్పయ్య మహా పడిపూజ నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన మంత్రి కలశాన్ని ఎత్తుకుని అయ్యప్ప మాలధారుల్లో ఉత్సాహాన్ని నింపారు. రాజకీయ జీవితంలో ఎంత బిజీగా ఉంటున్నప్పటికీ 40 ఏళ్లుగా స్వామి వారి సేవ, పడి పూజ, పంబారట్టు కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు వివరించారు. ఈ నెల 14న తొర్రూరులోని అయ్యప్ప మందిరంలో నిర్వహిస్తున్న మహా పడిపూజ, పం బారట్టు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, నాయకులు అయిత రాంచందర్, గట్టు నర్సింహాచార్యులు, వల్లపు వెంకటేశ్వర్లు, తక్కళ్లపల్లి రవీందర్రావు, తాళ్లపల్లి సంతోష్గౌడ్, బదావత్ వీరూనాయక్, రఘుపతి పాల్గొన్నారు.
అభిమానికి ఆటో అందజేత..
రాయపర్తి : టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానుల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. మండలంలోని పన్యానాయక్ తండాకు చెందిన దయన్న యువసేన వ్యవస్థాపక మండల అధ్యక్షుడు బదావత్ వీరూనాయక్ ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. నాలుగు నెలల క్రితం ఇంటి ముందు పార్కు చేసిన ఆటోను గుర్తు తెలియని దొంగలు అపహరించుకుపోయారు. దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు మంత్రి ఎర్రబెల్లికి విషయం చెప్పాడు. ఈ క్రమంలో తన సొంత డబ్బులు సుమారు రూ.3.50లక్షలు వెచ్చించి మండల కేంద్రంలో వీరూనాయక్కు కానుకగా అందజేశారు. దీంతో వీరూనాయక్ కుటుంబ సభ్యులతో పాటు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.