నల్లబెల్లి, ఏప్రిల్ 15 : నల్లబెల్లి మండలం లెంకాలపల్లి శివారు కుమ్మరిమడుగు సమీపంలో ఎస్సారెస్పీ సబ్ కెనాల్ సీసీ, కల్వర్టును ధ్వంసం చేసిన ఘటనపై అధికారులు స్పందించారు. ‘ఎస్సారెస్పీ ఉపకాల్వలు కబ్జా’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ఈ నెల 14న కథనం ప్రచురితమైంది. ఈమేరకు వరంగల్ ప్రావీణ్య స్పందించి విచారణకు ఆదేశించారు. దీంతో ఇరిగేషన్శాఖ డీఈ సంగాల రవి, ఏఈ పవిత్ర సోమవారం పరిశీలించారు. ఆయకట్టు రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్సారెస్పీ 17ఎల్ ఉపకాల్వ ధ్వంసం చేసి న రైతు పేరం రాజయ్య, అతడి కుమారుడు పేరం పెద్ద రాజుతోపాటు ఉపయోగించిన యంత్రం వివరాలతో స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన ట్లు డీఈ వెల్లడించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినా, ఆక్రమించినా ఉపేక్షించేది లేదని, బాధ్యులు ఏడేళ్ల జైలు శిక్షకు అర్హులవుతారని హెచ్చరించారు.