నర్సింహులపేట/కురవి, మే 2: భూస్వాము లు, ఎకరాల భూమి ఉన్నవారికే ఇందిరమ్మ ఇం డ్లా?.. అర్హులకు కేటాయించాలని, లేకుంటే ఊ రుకోమని పెద్దనాగారం, తట్టుపల్లి గ్రామస్తులు హెచ్చరించారు. అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇ వ్వాలని కోరుతూ శుక్రవారం నర్సింహులపేటలో ని ఎంపీడీవో కార్యాలయం ఎదుట పెద్దనాగారం లబ్ధిదారులు, కురవి మండలం తట్టుపల్లి జీపీ కార్యాలయం ఎదుట అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో యాకయ్యకు విన తి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడు తూ గ్రామసభలో తమ పేర్లు చదివారని, ఇందిరమ్మ కమిటీ వచ్చిన తర్వాత అవి లేకుండాపోయాయని అ న్నారు.
అర్హులైన వారికి కాకుండా లీడర్లు కుమ్మకై తమ కు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. తట్టుపల్లి లో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, అధికారులు 20 మందిని ఎంపిక చేశారని, భూమి ఉండి, వేరే గ్రా మాల్లోని వ్యక్తుల పేర్లు తీసివేయాలన్నారు. గ్రా మంలో అర్హత కలిగిన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, లేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మందు బద్రీనాథ్, వినోద్ కుమార్, మల్లయ్య, శ్రీను, వెంకన్న, ఉప్పలయ్య, రాములు, పర్శరాములు, అఖిలపక్షం నాయకులు డీవై గిరి, మాజీ ఎంపీటీసీ పోతుగంటి వెంకన్న, అంతటి సురేశ్, కొత్త ప్రభాకర్, బోనాల రవి, మదనాచారి పాల్గొన్నారు.