హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైర్ వెహికిల్స్ అసోసియేషన్ చేపట్టిన సమ్మె రెండోరోజూ గురువారం తీవ్రరూపం దాల్చింది. తమ బాధలు చెప్పుకొనేందుకు సచివాలయంలోని మీడియా పాయిం ట్ వద్దకు బయలుదేరిన అద్దె వాహనదారులను పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు 50 మందిని అరెస్టు చేసి అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్కు తరలించారు. మిగిలిన ఆందోళనకారులు సైతం స్టేషన్కు చేరుకుని తమవారికి మద్దతుగా నినాదాలు చేయగా, సొంత పూచీకత్తుపై వారిని వదిలేశారు. 18 నెలలుగా అద్దె బకాయిలు రూ.170 కోట్లకు చేరాయని, అవి చెల్లించాలని అడిగితే సర్కార్ అరెస్టు చేయిస్తున్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.