న్యూశాయంపేట, ఆగస్టు 27 : నిరుపేదల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. నగరంలోని దీన్దయాళ్ నగర్లో బీసీ బంధు పథకం ద్వారా రాయబారపు శ్రీనివాస్ లబ్ధి పొంది ఏర్పాటు చేసుకున్న కిరాణా షాపును ఆదివారం చీఫ్ విప్ వినయ్భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అర్హులైన వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామన్నారు. పేదల ఆర్థికాభివృద్ధికి దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీల రుణాలతో పాటు నిరుపేద కుటుంబంలోని ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు, ప్రతి రైతుకు రైతు బంధు అందజేస్తూ సీఎం కేసీఆర్ భరోసా కల్పిస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పట్టడం ఖాయమన్నారు. రాష్ట్రంలో మూడోసారి కేసీఆర్ సీఎంగా అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
ఆటో డ్రైవర్ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా
నగరంలోని ఆటో డ్రైవర్ల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. శాయంపేటలోని రాజరాజేశ్వరీ ఆటో యూనియన్ భవనానికి ఆదివారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో చీఫ్విప్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఆటో భవన్ ఏర్పాటుతో పాటు, ఆటో డ్రైవర్ల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. 30 ఏండ్లుగా ఆటో కార్మికులకు అండగా ఉంటున్నామన్నారు. త్రిచక్ర పొదుపు పరపతి సహాయ సహకార సంఘం ఏర్పాటుతో ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల నుంచి ఆటో డ్రైవర్లకు విముక్తి లభించిందన్నారు. రాజరాజేశ్వరీ ఆటో యూనియన్ కూడా సహకార సంఘం ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. పొదుపు సంఘం అభివృద్ధికి తన వంతు సహాయంగా జీతం నుంచి ఆర్థికసాయం అందజేస్తానన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రమేశ్, కార్పొరేటర్ మామిండ్ల రాజు, మాజీ కార్పొరేటర్లు వెల్పుల మోహన్రావు, మాడిశెట్టి శివశంకర్, ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ సారయ్యను కలిసిన నన్నపునేని
గిర్మాజీపేట, ఆగస్టు 27: సీఎం కేసీఆర్ తూర్పు నియోజకవర్గ టికెట్ను తనకు కేటాయించిన నేపథ్యంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆదివారం ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందిం చి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగాఎమ్మెల్యే నన్నపునేనికి ఎమ్మెల్సీ సారయ్య శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్లు దిడ్డి కుమారస్వామి, గుండేటి నరేందర్, ఎనుమాముల మార్కెట్ మాజీ చైర్మన్ తుమికి రమేశ్బాబు ఉన్నారు.